టీమిండియా కెప్టెన్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నటుడు అక్కినేని అఖిల్ తో ముచ్చటించారు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో విండీస్ తో రెండో టెస్టు సందర్భంగా హైదరాబాద్ కు చేరుకున్న విరాట్ కోహ్లీ.. నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వెళ్లి సందడి చేశారు. రెండో టెస్టు నిమిత్తం కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్కు వచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయనపై ఓ ప్రకటనను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. ఈ చిత్రీకరణకు సమయం పట్టే సందర్భంలో విరాట్ కోహ్లీ, అక్కినేని అఖిల్ తో కలిసి సరదాగా ముచ్చటించారు. వీరిద్దరు కరాచలనం చేసుకున్న ఫోటోలతో పాటు.. ముచ్చటిస్తున్న ఫొటోలు నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభంకానుంది. ఇందుకోసం టీమిండియా, వెస్టీండీస్ జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరకున్నాయి.
మరోపక్క విరాట్ భార్య అనుష్క ‘సుయీ ధాగా’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడంతో భర్తతో కలిసి మ్యాచ్ను వీక్షించేందుకు హైదరాబాద్కు వచ్చారు. అనుష్క నటించిన ‘జీరో’ చిత్రం నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ మరో కథానాయికగా నటించారు. ఆనంద్ ఎల్.రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more