సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న టీమిండియా జట్టుపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించారు. మరీ ముఖ్యంగా బౌలింగ్ లైనప్ ను కొనియాడారు. మునుపెన్నడూ లేనంత బలమైన బౌలింగ్ లైనప్ తో భారత్ జట్టు వెళ్తోందని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా బౌలింగ్ లైనప్ పరిపూర్ణంగా వుందని అన్నారు. ఈ నెల 27, 29న ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండ్తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ను ఆడేందుకు అక్కడికి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో..సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడుతూ భారత జట్టు బలాబలాలపై విశ్లేషించాడు
‘భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మునుపెన్నడూ లేనంత బలంగా ప్రస్తుతం ఉంది. జట్టులో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్, ఎత్తైన బౌలర్ ఇషాంత్ శర్మ, స్కిడ్డీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వేగవంతంగా బంతులు విసిరే ఉమేశ్ యాదవ్ లు ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్ దొరికితే.. జట్టుకి అదనపు ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే.. ఈ బౌలింగ్ అటాక్ అత్యుత్తమని నా అంచనా. భారత జట్టు మేనేజ్మెంట్ బ్యాట్తో పరుగులు రాబట్టే ఫాస్ట్ బౌలర్లవైపు ఎక్కువ మొగ్గు చూపుతోంది. భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య ఇప్పటికే బ్యాట్తో కూడా రాణించారు. ఇంగ్లాండ్ పర్యటనలో అలాంటి ఆల్రౌండర్లే కీలకం కానున్నారు’ అని సచిన్ వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more