ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు రెండో రోజు కూడా ప్రకృతి అనుకూలించలేదు. తొలి రోజుల బ్యాడ్ లైట్ తో వికెట్లు కోల్పోయిన టీమిండియా.. రెండో రోజున కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ఛట్టేశ్వర్ పూజారా మినహా టీమిండియాలో ఎవరు కనీసం రాణించకలేకపోయారు. తొలి రోజున చేసిన మూడు వికెట్ల నష్టానికి 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా, రెండో రోజున అట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.
తొలి రోజు 11.5 ఓవర్లకు అడిన జట్లు.. ఇవాల రెండో రోజున 20.1 ఓవర్లకు ఆటను పరిమితం చేశాడు. ఇవాళ టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె (4; 21 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 30 వద్ద పెవిలియన్ చేరాడు. శనక వేసిన 17.2వ బంతికి పేలవ షాట్ ఆడి డిక్వెలా చేతికి చిక్కాడు. అ తరువాత రవిచంద్రన్ అశ్విన్ (4) సైతం శనక బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు 50 పరుగులకు చేరిన సమయంలో శనక వేసిన బంతిని కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాట పట్టాడు.
వరుసగా తన జట్ట సహచర అటగాళ్లు వికెట్లు పడుతున్నా టీమిండియా నయా వాల్ ఛెతేశ్వర్ పుజారా (47 బ్యాటింగ్; 102 బంతుల్లో 9×4) మాత్రం తనదైన శైలిలో అచితూచి అడుతూ చెడు బంతుల బరతం పడుతూ.. పట్టుదలతో అర్ధశతకానికి చేరువయ్యాడు. ఇవాళ మ్యాచ్ ముగిసే సమాయానికి చతేశ్వర్ పూజారా 47 పరుగుల వద్ద నిలువగా, అతనికి తోడుగా.. వికెట్ కీపర్, బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా (6 బ్యాటింగ్: 22 బంతుల్లో 1×4) తన సహకారం అందిస్తున్నాడు. లంచ్ విరామం తరువాత మళ్లీ వర్షం కురియడంతో మ్యాచ్ ను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు.
శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మొదలైన తేలికపాటి జల్లు క్రమంగా పెరిగి భారీ వర్షంగా మారింది. అప్పటికి టీమిండియా 32.5 ఓవర్లకు 74/5తో ఉంది. వర్షం మధ్యలో కొంత తెరపినివ్వడంతో సిబ్బంది సూపర్ సోపర్లతో నీటిని బయటకు తోడేందుకు శ్రమించారు. అంతలోనే మళ్లీ వర్షం మొదలైంది. ఇలా రెండు మూడుసార్లు జరగడంతో చేసేదేమీ లేక సిబ్బంది వాన ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూశారు. వర్షం మళ్లీ.. మళ్లీ కురవడం, వెలుతురు లేమి వల్ల రెండో రోజు ఆటను అంపైర్లు పూర్తిగా నిలిపేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more