కేరళకు చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కు కేరళ హైకోర్టు షాకిచ్చిన నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో నిందితుడైన ఈ ఆటగాడు ఇక వేరే దేశం తరపున క్రికెట్ ఆడే యోచనలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా శ్రీశాంత్ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న వైఖరికి తీవ్ర మనస్తాపం చెందిన అతను ఇక టీమిండియాకు ఆడే అవకాశం లేకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చాడు. దీనిలో భాగంగా తాను వేరే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకున్నట్లు తన మదిలోని అలోచనను స్పష్టం చేశాడు.
బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే తాను కూడా తనదారి తాను చూసుకుంటాననే హెచ్చరికలు జారీ చేశాడు. 'నన్ను బీసీసీఐ నిషేధించింది. అంతేకానీ ఐసీసీ కాదు. అంటే నేను భారత్ తరపున మాత్రమే ఆడకూడదు. వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా. నా వయసు ఇంకా 34 ఏళ్లే. నా కెరీర్ చాలా ఉంది. ఇంకా ఆరేళ్లుగా పైగా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఒక వ్యక్తిగా నాకు క్రికెట్ అంటే ఇష్టం. అందుచేత క్రికెట్ నే ఆడాలనుకుంటున్నా.
బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అలానే వేరే దేశానికి క్రికెట్ ఆడతా. నాపై నిషేధం కొనసాగించే నిర్ణయం బీసీసీఐకే వదిలేశా. ఇక్కడ కేరళ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం వేరు'అని దుబాయ్ లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన సందర్భంలో శ్రీశాంత్ స్పష్టం చేశాడు. గత కొన్ని రోజుల క్రితం స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన పేస్ బౌలర్ శ్రీశాంత్పై బీసీసీఐ విధించిన నిషేధం కొనసాగుతుందని జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయరాఘవన్లతో కూడిన కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more