అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా క్రికెట్పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విజయాలు ఇలాగే కొనసాగితే.. 2002-04 సంవత్సరాల్లో సౌరవ్ గంగూలీ నేతృత్యంలోని భారత్ జట్టు అందుకున్న విజయాలను కూడా అధిగమించి ముందుకుసాగుతుందని అశాభావం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా విదేశీగడ్డలపై టెస్టు మ్యాచ్ లలో గంగూలీ అందుకున్న విజయాలను కూడా కోహ్లీ అధిగమించి.. నూతన చరిత్రను సృష్టించడగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ టెస్టు జట్టు.. విదేశాల్లో కూడా విజయాలు సాధించేగలదని ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో విరాట్ సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ఉందని.. ఇదే తరహా విజయ పరంపరను విదేశాల్లో కూడా కొనసాగించే జట్టు ఇది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇక విదేశాల్లో విజయాలను సాధించడానికి అపసోపాలు పడాల్సిన అవసరం లేదన్నాడు. విరాట్ సైన్యంలో ఇప్పుడు పటిష్టమైన బౌలింగ్ సైన్యం కూడా వుందని అది విదేశీ గడ్డలపై విజయాలను కూడా సుసాధ్యం చేస్తుందన్నాడు.
ప్రధానంగా భారత పేస్ బౌలింగ్ బలం బాగా మెరుగుపడటమే ఇందుకు కారణం. మంచి బౌలింగ్తో సత్తా చాటితే విదేశాల్లో విజయాలు ఏమాత్రం కష్టం కాదు. ఇప్పుడు మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ తదితర ఫాస్ట్ బౌలర్లతో కూడిన జట్టు భారత్కు ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. తన క్రికెట్ జర్నీలో దేశవాళీ టోర్నీలో నిలకడగా ప్రదర్శనలు చేసిన వారు చాలా మంది ఉన్నారని, అదే సమయంలో వారికి తగినంత గౌరవం కూడా లభించలేదని ఆనాటి విషయాల్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more