వెస్టిండీస్ గడ్డపై తన సహజ ఆట తరీుతో రాణిస్తున్న టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తన కెరీర్ లోనే బెస్ట్ ర్యాంకులో నిలిచాడు. తన నేతృత్వంలో టీమిండియాను తీసుకుని ఏకంగా జింబాబ్వేపై సిరీస్ ను గెలిచి వచ్చిన రహానే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో కూడా చక్కగా రాణించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్లో దూసుకుపోయాడు. ఐసీసీ తాజాగా వెల్లడించిన ఆటగాళ్ల ర్యాంకుల జాబితాలో రహానే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు.
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ యూనిస్ ఖాన్తో సంయుక్తంగా 11వ ర్యాంకును పంచుకున్న రహానే.. తాజా టెస్టు ర్యాంకుల్లో 8వ స్థానానికి చేరుకున్నాడు. కాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లలో అస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ లో నిలువగా, ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన యూనిస్ ఖాన్ మరోసారి టాప్ 5లో చోటు సంపాధించాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం తన ర్యాంకును జారవిడుచుకున్నాడు.
గతంలో 13వ ర్యాంకులో వున్న కోహ్లీ తాజా ర్యాంకులలో 16వ స్థానానికి పడిపోయాడు. ఇక బౌలర్ల విషయంలో రవిచంద్రన్ అశ్విన్ తన ద్వితీయ స్థానాన్ని పథిలపర్చుకున్నాడు. రవీంద్ర జడేజా మాత్రం అరవ స్థానంలో కోనసాగుతున్నాడు. కాగా జేమ్స్ అండర్ సన్ మాత్రం బౌలర్ల జాబితాలో టాప్ లో కోనసాగుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more