న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రెండో టెస్టు ఎట్టకేలకు డ్రా ముగిసింది. 258/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 385/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. కాగా మ్యాచ్ పై అద్యంతం పట్టు నిలిపిన అసీస్ న్యూజీలాండ్ పై తొలిరోజు నుంచే అధిపత్యం ప్రదర్శించారు. భారీ స్కోరులతో దూసుకెళ్లినా.. కివీస్ బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో రాణించడంతో వారి అశలన్నీ అవిరయ్యాయి.
అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్(138), వోజస్(119)లు శతకాలతో రాణించగా, నెవిల్(35), జాన్సన్(29), స్టార్క్(28)లు ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీతో రాణించిన రాస్ టేలర్ కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి టెస్టులో గెలిచిన ఆసీస్ 1-0 తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన మూడో టెస్టు అడిలైడ్ లో నవంబర్ 27 నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్ ను తొలిసారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా నిర్వహించనున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 559/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 385/7
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 624 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 104/2
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more