టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి పాల్పడ్డాడని అతని స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ సెప్టెంబర్ 27న బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో వందన ఫిర్యాదు చేసింది. దీంతో అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం 'స్టేషన్ బెయిల్'పై విడుదల చేశారు. నిజానికి ఈ కేసును వందనా ఉపసంహరించుకోవాలని మొదట భావంచిందట. కానీ.. ఈ కేసు గురించి అమిత్ అస్సలు పట్టించుకోకపోవడం ఆమెకు ఆశ్చర్యానికి గురిచేసిందని.. అందుకే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని ఆమె స్పష్టం చేసింది.
'కేసు ఉపసంహరించుకోవాలని మొదట్లో అనుకున్నా. కానీ కేసు గురించి అమిత్ మిశ్రా అసలు పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. ఇప్పుడు ఈ కేసు కోర్టు, పోలీసుల ముందు ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది వారే తేలుస్తారు' అని వందన పేర్కొంది. ఇప్పుడిప్పుడే కెరీర్ ఎదుగుతున్న క్రమంలో అమిత్ మిశ్రాపై ఇలా కేసు నమోదు కావడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ కేసుతో అతని కెరీర్ గాడిలో పడే అవకాశం వుందని చెప్పుకుంటున్నారు. మరోవైపు.. తనమీద కేసు నమోదైనప్పుడు అందుకు సానుకూలంగా వ్యవహరించకుండా మిశ్రా ఎందుకు ఇలా మొండిగా వ్యవహరిస్తున్నాడో అంతు చిక్కకుండా వుంది. తన స్నేహితురాలే కాబట్టి.. ఆమెతో ఈ కేసు వ్యవహరంపై చర్చించి వుండాల్సిందని కొందరు సూచిస్తున్నా.. మిశ్రా మాత్రం తన వైఖరి మార్చుకునేలా కనిపంచట్లేదు. చివరికి.. ఈ కేసు అతని కెరీర్ ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.
మరోవైపు.. వందనా తన స్నేహితుడిన మిశ్రాపైనే కేసు పెట్టడమేంటని మరికొందరు మండిపడుతున్నారు. ఒకవేళ అతను అనుచిత వ్యాఖ్యలు చేసి వుంటే.. అందుకు సానుకూలంగా వ్యవహరించి ఇద్దరు చర్చించుకోవాల్సిందని, అలాకాకుండా ఆవేశంతో రగిలిపోయి కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ వ్యవహారం ఇంకా వేడిగానే సాగుతుందని అనుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more