మూడు టెస్టుల సీరిస్ లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమాయానికి ఆరు వికెట్ల నష్టాలనికి 319 పరుగులను సాధించిన కోహ్లీ సేన.. లంకేయుల బౌలర్లకు ధీటుగానే సమాధానం ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... తొలిరోజు ఆటలో మెరుగైన ఆటను ప్రదర్శించింది. ఆదిలోనే ఓపెనర్ మురళీ విజయ్(0) , అజింక్యా రహానే(4) వికెట్లను కోల్పోయింది.
తొలి టెస్టులోని రెండు ఇన్నింగ్స్ లో విఫలమైన రాహుల్ రెండో టెస్టులో అద్భుత శతకంతో రాణించాడు. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ(78) రాణించడంతో టీమిండియా తేరుకుంది. అనంతరం రోహిత్ శర్మ(79) కూడా ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా 87.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దామిక ప్రసాద్, హెరాత్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.
రెండో టెస్టును కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న లంకేయుల ఆశలపై భారత్ బాట్స్ మెన్లు నీళ్లు చల్లారు. విరాట్, రాహుల్ లు అడ్డుకున్నారు. వచ్చీ రావడంతో తన సహజసిద్ధమైన ఆట తీరుతో రెచ్చిపోయిన కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలోనే హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. కాగా, కోహ్లీని హెరాత్ పెవిలియన్ కు పంపి మరోసారి టీమిండియాకు షాకిచ్చాడు. అయితే రెండో టెస్టులోనూ శతకం సాధించాలనుకున్న విరాట్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తరువాత వచ్చిన రోహిత్ శర్మ లంకేయుల ఆశలకు కళ్లెం వేశాడు. రోహిత్ కూడా రాణించడంతో తొలిరోజు టీమిండియాపై పైచేయి సాధించాలనుకున్న శ్రీలంక ఆశలకు బ్రేక్ పడింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more