ఐసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందా..? అన్న సందేహానికి తెరపడింది. క్రికెట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆ పదవి.. ప్రపంచంలో వుండే ఎందరో వ్యక్తుల్ని పరిశీలించి చివరకు పాక్ మాజీ కెప్టెన్ ని వరించింది. ఆయన పేరు జహీర్ అబ్బాస్. బార్బాడోస్ లో జరిగిన ఐసీసీ వార్షిక సదస్సులో అధ్యక్ష పదవికి ఆయన్ను ఎన్నుకున్నట్టు ఒక ప్రకటన వెలువడింది. వెంటనే ఆయన కూడా ఓ సంవత్సరంపాటు సేవలందించేలా జహీర్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జహీర్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ నియంత్రణా మండలికి అధ్యక్ష బాధ్యతలు లభించడం నాకు ఎంతో ఆనందంగా వుంది. ఈ ఆట వివిధ దేశాలమధ్య స్నేహ, గౌరవ బంధాలను పెంచుతోంది. పలు దేశాలకు సేవలు అందించే అవకాశం లభించడం నాకెంతో గర్వకారణంగా అనిపిస్తోంది. ఈ పదవిలో కొనసాగేంతకాలం బాగా సేవలందించడంలో తీవ్ర కృషి చేస్తా’ అని అన్నారు. ఇక ఈ అధ్యక్ష పదవి దక్కేలా తన పేరును సిఫార్సు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈయన ఎన్నికపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతోపాటు క్రికెట్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన గురించి బీసీసీఐ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. జహీర్ ఒక గొప్ప క్రికెటరని కొనియాడారు.
ఇదిలావుండగా.. పాక్ జట్టు తరఫున జహీర్ 78 టెస్టులు, 62 వన్డే మ్యాచులు ఆడారు. 1969 నుంచి 1985 మధ్యకాలంలో ఆడిన ఆయన.. మడు ప్రపంచకప్ పోటీలకు పాక్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. వన్డేల్లో 2,572, టెస్టుల్లో 5,062 పరుగులు చేశారు. ఆసియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 100 సెంచరీలను దాటిన ఘనమైన రికార్డు అతని పేరిటే వుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more