No decision on India-Pakistan cricket series yet | sushma swaraj | Indo Pak cricket series

No decision on indo pak cricket series sushma swaraj

No decision on Indo-Pak cricket series:, Minister Sushma Swaraj, union External Affairs Minister Sushma Swaraj, Indo-Pak cricket series, Pakistan Cricket Board, bcci, jagmohan dalmiya, PCB Chairman Shaharyar Khan, BCCI President Jagmohan Dalmiya, proposed Indo-Pak cricket series, three Tests, five ODIs and two T20s in UAE in December

No decision has been taken on Indo-Pak cricket series, External Affairs Minister Sushma Swaraj said

పాకిస్థాన్ తో సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు

Posted: 06/02/2015 03:06 PM IST
No decision on indo pak cricket series sushma swaraj

భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య డిసెంబర్‌లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందంటూ వస్తున్న వార్తలపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టతనిచ్చారు. ఈ సిరీస్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తేల్చిచెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ఇటీవల భారత్‌కు వచ్చినప్పుడు బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాతో భేటీ అయ్యాడు. అనంతరం ఇరువురు కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, డిసెంబర్‌లో ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుందని ప్రకటించారు. అనంతరం షహర్యార్ స్వదేశానికి వెళ్లి, సిరీస్ ఒప్పందంపై సంతకాలు కూడా పూర్తయినట్టు తెలిపాడు. రెండు దేశాలు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి-20 మ్యాచ్‌లు ఆడతాయని వివరించాడు. టెస్టు సిరీస్ కోల్‌కతాలో మొదలు కావాలని దాల్మియా సూచించాడని అయితే, హోం సిరీస్‌లను తాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడుతున్నందున, భారత్‌తో సిరీస్ కూడా అక్కడే ఉంటుందని వెల్లడించాడు.

అయితే, ఈ వార్తలను భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ తోసిపుచ్చారు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌పై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇప్పటి వరకూ ఎవరూ ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని, తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ముంబయిపై 2008లో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. 2012 డిసెంబర్‌లో భారత్‌లో పాకిస్తాన్ జట్టు మూడు వనే్డలు, రెండు టి-20 మ్యాచ్‌లు ఆడింది. వాటిని మినహాయిస్తే, 2008 నుంచి ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి సిరీస్‌లు జరగలేదు. ఆసియా కప్ లేదా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో తప్ప భారత్, పాకిస్తాన్ జట్లు తలపడడం లేదు. ఈఏడాది డిసెంబర్‌లో రెండు దేశాలు పూర్తి స్థాయి సిరీస్ ఆడతాయని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, కేంద్రం ఈ విషయంపై ఆసక్తి చూపడం లేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Indo-Pak cricket series: Bcci  

Other Articles