న్యూజీలాండ్ క్రికెటర్.. కివీస్ పాస్ట్ బౌలర్ టిమ్ సౌతీకి ఓ ప్రముఖ చానెల్ మహిళా రిపోర్టర్ ను క్రికెట్ బంతితో కోట్టాడు. ఇదేం విచిత్రం.. మహిళా రిపోర్టర్ అని కూడా చూడకుండా ఏకంగా క్రికెట్ బంతితో కోడతాడా..? అస్ట్రేలియా సీరీస్ లో టీమిండియా యువ సంచలనం రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకే అటు క్రికెట్ అభిమానులు, క్రికెట్ ప్రపంచ శ్రేణులు, బిసీసీఐ ఒక్కరు కాదు అన్ని రకాలుగా అందరూ ఆయన చర్యలను తప్పుబట్టారు కానీ.. ఇక్కడేమిట్రా అంటే.. ఏకంగా ఈ.ఎస్.పీ.ఎన్. రిపోర్టర్ పై బంతితోనే దాడి చేసినా.. ఎవరూ కిమ్మంనకుండా కూర్చున్నారు ఎందుకంటారూ..?
ఎందుకంటే అయన కావాలని బంతిని కోట్టలేదు కాబట్టి. ఆయనకు ఈఎస్పీఎన్ మహిళా రిపోర్టర్ మెలిండా ఫారెల్ కు మధ్య ఎలాంటి ఘర్షణాత్మక వైఖరి లేదు కాబట్టి. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో సౌతీ క్రికెట్ ప్రాక్టీసు చేస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ కు చేరుకున్న రిపోర్టర్ మెలిండా.. అక్కడ వారి ప్రాక్టీసు సెషన్ పై సమాచారాన్ని అందించే పనిలో మరో ఇద్దరు వ్యాఖ్యలతో చర్చిస్తుంది. ఇంతలో బాల్ వచ్చేసింది కిందకు వంగండన్న అరుపులతో వారు అలర్ట్ అయ్యారు. అయినా అది మహిళా రిపోర్టర్ మెలిండాకు తగిలింది. దీంతో తాను కొట్టిన షాట్ రిపోర్టర్ కు తగలడంతో పరుగుపరుగున వచ్చని సౌతీ అమె ఆరోగ్యంపై వాకాబు చేశాడు. తనను క్షమించమని కోరాడు. తాను అనుకోకుండా కోట్టిన షాట్ వల్ల గాయలైయితే మన్నించాల్సిందిగా కోరాడు.
ఈ విషయం బిబిసీ న్యూస్ లో రావడంతో రిపోర్టర్ అరోగ్యం ఎలా వుందంటూ పలువురు అమెను సోషల్ మీడియా ద్వారా వాకాబు చేశారు. కాగా సౌతీ కోట్టిన షాట్ తనకు తగలడాన్ని తాను గర్వంగా తీసుకుంటున్నట్లు రిపోర్టర్ చెప్పారు. అయితే తన ఆరోగ్యంపై వాకాబు చేసిన వారందరికీ కృతజ్ఞతలను కూడా తెలిపారు. అంతేకాదండోయ్.. ఇక్కడ కూడా అమె సౌతీ గురించి ప్రస్తావించారు. బంతి తగలడంతోనే సౌతీ తన చెంతకు వచ్చి ఆరోగ్యంపై వాకాబు చేసిన తీరు తనకు బాగా నచ్చిందని, అమె తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కోన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more