ప్రపంచవ్యాప్తంగా చాలా కూలెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా ప్రత్యేక గుర్తింపు సాధించిన మహేంద్రసింగ్ ధోనీకి ఈసారి కోపమొచ్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఇతని కోపానికి ఏకంగా ఓ మొబైల్ సంస్థ చిక్కుల్లో పడింది. గతంలోనే ధోనీ ఆ సంస్థను హెచ్చరించాడు. కానీ ధోనీ కూలెస్ట్ డూడ్ కదా ఎటువంటి వివాదాలు రావని ఆ సంస్థ భావించిందేమో.. ఈసారి కాస్త మితిమీరి వ్యవహరించింది. అంతే! గతంలో వార్నింగ్ ఇచ్చిన ధోనీ ఈసారి ఆ సంస్థపై డైరెక్ట్ అటాక్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్లక్రితం ధోనీ ‘మ్యాక్స్’ మొబైల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సంస్థ మొబైల్స్ ను ప్రచారం చేసే భాగంలో ధోనీ కొన్నాళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆ సంస్థ ధోనీతో కొన్ని యాడ్స్ చేయించుకుంది. అయితే.. తనతో ఒప్పందం కింద రూ.10 కోట్ల మేర బకాయిలు ఇంకా చెల్లించలదేని, ఇంకా ఇతరత్ర వివాదాలు వచ్చిన నేపథ్యంలో ధోనీ ఆ సంస్థతో ఒప్పందం తెగదెంపులు చేశాడు. అయినప్పటికీ ఆ మొబైల్ తయారీ సంస్థ ఒప్పందానికి విరుద్ధంగా తన పేరును ఉత్పత్తులపై వాడుకుంటోందని ధోనీ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పుడు కోర్టు ధోనీ పేరును వాణిజ్యపరంగా వినియోగించరాదని ఆ సంస్థను ఆదేశించింది. కానీ.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం పట్టించుకోకుండా, ధోనీ కోపాన్ని గుర్తించకుండా ఆ సంస్థ అతని పేరును మళ్లీ వాడటం మొదలుపెట్టింది.
అంతే! ఓవైపు ఒప్పందం ప్రకారం ఇంకా బకాయిలు చెల్లించకపోవడమే కాక.. ఒప్పందానికి విరుద్ధంగా తన పేరును వాడుకోడంపై ధోనీకి మరింత కోపం వచ్చింది. మరోసారి ఇతగాడు ఢిల్లీ హైకోర్టులో ఆ కంపెనీ మీద ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కోర్టు ‘మ్యాక్స్’ సంస్థ నుంచి స్పందన కోరింది. మరి.. ఈసారి ఈ సంస్థ ధోనీకి బకాయిలు చెల్లిస్తుందో లేక పైత్యం ఎక్కువై మరిన్ని చిక్కుల్లో పడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more