ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. జట్టులో మెరుగైన ఆటగాళ్లు వున్నప్పటికీ వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయిన ముంబై.. చివరకు తన ప్రతాపాన్ని బెంగుళూరు జట్టుపై ప్రదర్శించి సత్తా చాటింది. ప్రత్యర్థి జట్టులో కూడా అద్భుత ఆటగాళ్లు వున్నా.. ముంబై బౌలర్లు వారిని ధీటుగానే ఎదుర్కోవడంతో ఈ విజయం వారికి వరించింది. మొదట ముంబై భారీ స్కోరు నమోదు చేయగా.. దాన్ని ఛేజ్ చేసేందుకు బెంగుళూరు ఆటగాళ్లు చివరిదాకా కష్టపడ్డారు కానీ.. 18 పరుగులతో ఓడిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. మొదట టాస్ గెలిచి బెంగుళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ముంబై ఆటగాళ్లను బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించింది. దీంతో బరిలోకి దిగిన ముంబై బ్యాట్స్ మెన్లు మొదటి నుంచే చెలరేగారు. మొదటి ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన ముంబై.. ఆ తర్వాత తమ ప్రతాపం చూపారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ లెండిల్ సిమ్మన్స్ (59)తోపాటు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఉన్ముక్త్ చంద్ (58) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఇక తర్వాత సెకండ్ బౌన్ లో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు కెప్టెన్ కేవలం 15 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఇలా వీరు ముగ్గురి భారీ స్కోరుతోపాటు మిగిలిన ఆటగాళ్ల స్కోరుతో కలిపి ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు మొత్తం 209 పరుగులు చేసింది.
ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు ఆటగాళ్లు మొదట్లోనే తడబడ్డారు. విధ్వంసక ఆటగాడైనా క్రిస్ గేల్ (10) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 18 పరుగులకే చేసి చేతులెత్తేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (11 బంతుల్లో 41), డేవిడ్ వైస్ (47) పోరాడినా.. మిగిలిన ఆటగాళ్లు తక్కువ స్కోరు చేసి పవెలియన్ చేరడంతో బెంగుళూరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులే చేయగలిగింది. ఇక బంతితో చేలరేగి మూడు కీలక వికెట్లు తీసిన ముంబై బౌలర్ హర్భజన్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more