శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజ ఆటగాళ్లు.. కుమార సంగక్కర, మహేల జయవర్ధనేలు 50 ఓవర్ల నిర్ణీత మ్యాచ్ లకు వీడ్కోలు పలికారు. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నాకౌట్ దశలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లంక ఓటమి అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్ల వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఈ రోజు ఆటలో శ్రీలంక పేలవంగా ఆడి వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించింది. దీంతో ముందగా ప్రకటించినట్లుగానే లంక బ్యాట్స్ మెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్థనే లు వన్డేల నుంచి వైదొలిగారు.
ఇప్పటివరకూ సుదీర్ఘ క్రికెట్ ఆడిన సంగక్కార నేటి మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్ బై చెబుతూ భారంగా స్టేడియంను విడిచాడు. దీంతో సంగక్కరను అళింగనం చేసుకుని సహచర క్రికెటర్లు ఆయన వీడ్కోలు పలికారు. ఇప్పటి వరకు 404 వన్డేలు ఆడిన సంగక్కార 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు సాయంతో 14,234 పరుగులు సాధించిన 14 వేల పరుగుల క్లబ్ లో ప్రపంచకప్ లో భాగంగా అడిన మ్యాచ్ లలోనే చేరాడు. అతని అత్యధిక స్కోరు 169 కాగా, బ్యాటింగ్ సగటు 41.98 గా ఉంది. మహేలా జయవర్ధనే 448 వన్డేలు ఆడి 19 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీల సాయంతో 12, 650 పరుగులు చేశాడు.
కాగా సంగక్కర, జయవర్థనేలు 50 ఓవర్ల నిర్ణీత మ్యాచులకు వీడ్కోలు పలకడం పట్ల వారిపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి విషెస్ అందుతున్నాయి. అటు సామాజిక మీడియాలో కూడా వారికి శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి. ట్విట్టర్ లో పలు దేశాలకు చెందిన క్రికెట్ క్రీడాకారులు కూడా సంగక్కరకు అభినందనలు తెలుపుతున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలపించగల సంగాక్కరను ఆసాంతం అకాశానికెత్తుతున్నారు. అటు భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ కూడా సంగక్కర, జయవర్థనేలకు అభినందనలు తెలిపారు. వారు లేకుండా శ్రీలంక టీమ్ ను ఊహించకోడానికి కూడా మనస్సు అంగీకరించడం లేదన్నారు. ఇద్దరికి శుబాకాంక్షలను తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more