ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో తొలి అంకానికి ఇవాళ జరిగిన మ్యాచ్ లతో ముగింపు పలకగా, రెండో అంకానికి తెర లేసింది. కీలకమైన నాకౌట్ పోరుకు క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన ఎనమిది జట్లు సిద్దం కానున్నాయి ఈ నెల 16, 17 విశ్రాంతి దినాలు. 18 నుంచి క్వార్టర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత సెమీస్ మ్యాచ్లు.. 29న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో 14 జట్లు పాల్గొనగా 8 క్వార్టర్స్కు అర్హత సాధించాయి. లీగ్ దశలో డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య జట్టు న్యూజిలాండ్లు మాత్రమే ఓటమి లేకుండా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించాయి. గ్రూపు-ఎ టాపర్గా కివీస్, 'బి' టాపర్గా టీమిండియా నిలిచాయి. ఉపఖండం జట్లు భారత్, పాక్, లంక, బంగ్లాదేశ్ నాకౌట్కు అర్హత సాధించాయి. అగ్రశ్రేణి జట్లలో ఇంగ్లండ్ మాత్రమే లీగ్ దశలో ఇంటిదారిపట్టింది. క్వార్టర్స్లో గ్రూపు-ఎ టాప్ 4 జట్లు.. గ్రూపు-బి టాప్ 4 జట్లతో తలపడనున్నాయి. కాబట్టి క్వార్టర్స్ ప్రత్యర్థులు లీగ్ దశలో ఒక్కసారి కూడా తలపడలేదు. క్వార్టర్స్ ఎవరు ఎవరితో తలపడతారంటే..
లంక - సౌతాఫ్రికా: ఈ నెల 18న అస్ట్రేలియాలోని సడ్నీలో జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ మూడో స్థానంలో ఉన్న లంక, గ్రూపు-బిలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా తలపడతాయి.
భారత్ - బంగ్లా: ఈ నెల 19న అస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోజరిగే రెండో క్వార్టర్స్లో ఉపఖండం జట్లు భారత్, బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకున్నాయి. గ్రూపు-బి టాపర్ టీమిండియా, గ్రూపు-ఎ 4వ స్థానంలో ఉన్న బంగ్లా మధ్య పోరు జరుగుతుంది.
ఆసీస్ - పాక్: ఈ నెల 20న అస్ట్రేలియాలోని అడిలైట్ లోజరిగే మూడో క్వార్టర్స్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్లు తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ రెండో స్థానంలో ఉన్న ఆసీస్, గ్రూపు-బి మూడో స్థానంలో ఉన్న పాక్ పోటీపడతాయి.
కివీస్ - విండీస్: ఈ నెల 21న న్యూజీలాండ్ లోని వెల్లింగ్టన్ లో జరిగే చివరి, నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ టాపర్ కివీస్, గ్రూపు-బి నాలుగో స్థానంలో ఉన్న విండీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
తొలి క్వార్టర్ ఫైనల్ లో తలపడి శ్రీలంక, సౌత్ అఫ్రికా జట్లలో గెలుపోందే జట్లు మూడో క్వార్టర్ ఫైనల్ లో తలపడే అసీస్, పాక్ లలో గెలిచే జట్లతో ఈ నెల 24న న్యూజీలాండ్ లోని అక్లాండ్ లో తొలి సెమీఫైనల్ లో తలపడనున్నాయి. కాగా రెండో క్వార్టర్ లో తలపడనున్న భారత్, బంగ్లాదేశ్ జట్లలో గెలుపోందే జట్టు. కివీస్, విండీస్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ లో గెలిచే జట్టుతో ఈ నెల 26న అస్ట్రేలియాలోని సిడ్నీలో రెండో సెమీ ఫైనల్ తలపడనున్నాయి. సెమీస్ లో గెలిచే జట్లు 29న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more