న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం మార్టిన్ క్రోకు అరుదైన గౌరవం లభించనుంది. త్వరలో ఈ గోప్ప స్టైలిష్ బ్యాట్ మెన్ ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం స్వీకరించనున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ఈ నెల 28న రెండు అతిథ్య జట్లు న్యూజీలాండ్, అస్ట్రేలియాల మధ్య జరగనున్న మ్యాచ్ అనంతరం ఆయనకు ఈ గౌరవాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ తాజా ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోని సభ్యులు సంఖ్య 79 కు చేరనుంది. అంతకుముందు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో న్యూజీలాండ్ నుంచి సర్ రిచర్డ్ హ్యాడ్లీ, డెబ్బీ హోక్లీ తరువాత మార్టిన్ క్రోకు స్థానం లభించనుంది.
1982లో పందోమ్మిదవ యేట అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన మార్టిన్ క్రో తొలి మ్యాచ్ ను ఫిబ్రవరిలో అస్ట్రేలియాతో ఆడాడు. ఆ తరువాత 13 ఏళ్లకు 1995లో ఆయన క్రికెట్ నుంచి విరామం తీసుకున్నారు. తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో 77 టెస్టు మ్యాచ్ లు అడిన మార్టిన్ సగటున 45.36తో 5 వేల 444 పరుగులు సాధించాడు. ఇందులో భాగంగా ఆయన 17 సెంచరీలు సాధించాడు. శ్రీలంకతో 1991లో జరిగిన మ్యాచ్ లో 299 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు 143 వన్డే మ్యాచ్ లు ఆడిన క్రో 38.55 పరుగలు సగుటున 4 వేల 704 పరుగులు సాధించాడు. ఈ ప్రయాణంలో ఆయన మూడు పర్యాయాలు ప్రపంచ క్రికెట్ కప్ లో భాగం పంచుకున్నాడు. ఈ రికార్డులను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. అనిల్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించనుంది
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more