విరాట్ కోహ్లీతో విభేదాలే ధోని రిటైర్మెంట్కు కారణమంటూ వస్తున్న కథనాలపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి స్పందించాడు. ధోని, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ చెత్త కథనాలంటూ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్యూలో స్పష్టం చేశాడు. ఆ వార్త కథనాలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. "కోహ్లీయే కాదు, సహాయక సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సహా జట్టులోని ప్రతి ఒక్కరు ధోనీ ఆజ్ఞలను గౌరవిస్తారని పేర్కొన్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా టీమిండియాకు ఆస్టేలియా ప్రధాని టోనీ అబాట్ ఇచ్చిన టీ పార్టీ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రీ పలు విషయాలను పంచుకున్నారు. బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీ, థావన్ ల మధ్య కూడా మీడియా గొడవ పెట్టేసి కథనాన్ని కూడా రాసుకుందని చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్పై వచ్చిన వార్తలనింటినీ ఆయన కోట్టిపారేశారు. గత ఐదు సంవత్సరాలుగా కోహ్లీ టీమిండియా సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మరికొంత మంది అండర్ - 19 నుంచి టీమిండియాకు క్రికెట్ ఆడుతున్నారని తెలిపాడు.
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోనీ తీసుకున్న నిర్ణయం జట్టునంతటినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. అయితే, తాను అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు శాస్త్రి పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత వ్యవహారమని, అత్యుత్తమ క్రీడాకారులకు తాము ఎప్పుడు నిష్క్రమించాలో తెలుసని అన్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నిస్తారని అన్నారు. అతనేమీ 100 టెస్టుల రికార్డు, ఇతర గణాంక ఘనతల కోసం వేచి చూడలేదని, ఘనమైన వీడ్కోలు కోరుకోలేదని చెప్పాడు. ఇది అతని వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాడు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more