భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏది చేసినా సంచలనమే అవుతోంది. మొన్న అనుష్క శర్మను వారించినా, శిఖర్ ధావన్ తో వాదించినా.. అది వెంటనే మీడియాకు చేరి.. సంచలనంగా మారుతుంది. అయితే ఇప్పుడు కూడా విరాట్ మరో సంచలనానికి తెరలేపాడు. భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా ప్రమోషన్ పొందిన యువ బ్యాట్స్మన్ కు అమాంతం క్రేజ్ బాగా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలోనూ విరాట్ హవా తీవ్రంగా కొనసాగుతోంది. టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంకా పూర్తిగా తీసుకోకమునుపే.. ఆయన ఏకంగా కొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ట్విట్టర్లో అత్యంత ఆదరణ గల క్రికెటర్ కోహ్లీ మరో రికార్డును నమోదు చేసుకున్నారు.
ట్విట్టర్లో మొన్నటివరకు అత్యధిక ఫాలోయర్స్ ఉన్న క్రికెటర్గా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను అధిగమించిన విరాట్.. తాజాగా మరో ఘనత సాధించాడు. 50 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న తొలి క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. ట్విట్టర్లో విరాట్కు 5,004,544 మంది ఫాలోయర్స్ ఉన్నారు. సచిన్కు 4,910,498 మంది, టెస్టులకు గుడ్ బై చెప్పిన ధోనీకి 3,374,509 మంది ఫాలోయర్స్ ఉన్నారు. విరాట్కు కేవలం మూడు నెలల్లోనే పది లక్షల మంది ఫాలోయర్స్ పెరగడం విశేషం. విరాట్ తన ఫాలోయర్స్కు కృతజ్ఞతలు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more