2013 ఐపీఎల్-6 సీజన్’లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో కొంతమంది క్రికెటర్లు, ఇతర ప్రముఖులు పేర్లు అప్పుడే తేలిపోయాయి కానీ.. ఇంకొంతమందితోబాటు శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మయ్యప్పన్’లు ఈ ఫిక్సింగ్’లో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆనాడే వీళ్లు పట్టుబడినా.. అందుకు తగ్గ సాక్ష్యాలకోసం విచారణను జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్గల్ కమిటీ ఈ ఫిక్సింగ్’లో భాగంగా విచారణ జరిపి.. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో శ్రీనివాస్’కు ఫిక్సింగ్’తో ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది కానీ.. అతని అల్లుడు మయ్యప్పన్ మాత్రం బుకీలతో చర్చలు జరిపినట్లు వెల్లడయ్యింది.
ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు తన విచారణలో గురునాథ్ మయప్పన్ తీరును తప్పుపట్టింది. బెట్టింగ్’లో అతనిపాత్ర ఇన్’సైడర్ ట్రేడింగ్’ను తలపిస్తోందని న్యాయమూర్తులు టి.ఎస్.ఠాకూర్, ఖలీపుల్లాలతో కూడిన ధర్మాసనం చెప్పింది. ‘‘మయప్పన్ తన జట్టు సమాచారాన్ని రహస్యంగా చేరవేయడం ద్వారా మరొకరికి బెట్టింగ్’లు కట్టేందుకు సహకరిస్తుంటే.. అది ఇన్’సైడర్ ట్రేడింగ్ లాంటిదే’’ అని వ్యాఖ్యానించింది. అలాగే చెన్నై ఫ్రాంచైజీలో మయప్పన్ పాత్రను కప్పిపుచ్చేందుకు శ్రీనివాసన్ ప్రయత్నాలను ముద్గల్ కమిటీ తన రెండో నివేదికలో ఎందుకు పేర్కొనలేదని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు ముద్గల్ కమిటీ నివేదికలోని క్రికెటర్ల పేర్లనూ తమ తదుపరి విచారణలో పరిశీలించి బహిర్గతం చేస్తామని కోర్టు చెప్పింది.
ఇదిలావుండగా.. ఈ కేసు విచారణలో భాగంగా బిహార్ క్రికెట్ సంఘం (క్యాబ్) తరఫున న్యాయవాది హరీష్ సాల్వే కోర్టులో తమ వాదనను వినిపించారు. మయప్పన్’ను, చెన్నై సూపర్ కింగ్స్’ను కాపాడుకోవడం కోసమే.. ఫ్రాంచైజీలో మయప్పన్ కేవలం ఔత్సాహికుడు మాత్రమేనని, శ్రీనివాసన్’తోబాటు అతడి సంస్థ ఇండియా సిమెంట్స్ చెబుతూ వచ్చిందని వాదించారు. ‘‘నివేదికను వెల్లడి చేయవద్దని బీసీసీఐ కోరుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికను ప్రజల ముందు వుంచడమే ఉత్తమం’’ అని ఆయన కోర్టును విన్నవించాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more