క్రికెట్ దిగ్గజంగా గొప్పలు చెప్పుకునే ఆస్ర్టేలియా.. భారత్ ను చూసి భయపడుతోంది. దిగ్గజానికి గతంలో చాలాసార్లు పెవిలియన్ బాట చూపిన ఘనత భారత్ కు ఉంది. దీంతో ధోని సేన అంటే దడ పుడుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ మొదటివారంలో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం రెండు వారాల ముందే జట్టును ప్రకటిస్తారట. ఈ విషయాన్ని ఆస్ర్టేలియా సెలక్టర్ మార్క్ వా స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
డిసెంబర్ 4నుంచి 8వ తేదీ వరకు భారత్-ఆస్ర్టేలియా మద్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ తేదికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం సరైనది కాదు. అయితే మార్కెట్ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని మార్క్ చెప్తున్నారు. కాని అసలు విషయం మరొకటి ఉందని తెలుస్తోంది. ఇక శనివారం రోజు సెలక్షన్ కమిటి సమావేశమై భారత్ తో జరిగే తొలి టెస్ట్ జట్టును ఖరారు చేయనుంది.
అటు ముందే టీంను ఎంపిక చేయటంపై ఆస్ర్టేలియా క్రికెట్ డైరెక్టర్ పాట్ హోవార్డ్ మాట్లాడుతూ.., మెరుగైన కసరత్తు, జట్టులో సమన్వయం కోసమే ఇలా ముందుగా టీంను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. గతంలో ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ కోసం కూడా ఇలాగే ముందుగా జట్టును ఎంపిక చేశామని చెప్పారు. ఆ సమయంలో సిరీస్ ను క్లీన్ స్వీప్ (5-0) చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా సిరీస్ పై కన్నేసి ముందుగా జట్టును ప్రకటిస్తామని అంటున్నారు. మరి కంగారుల కలలు నిజమవుతాయా లేదా అనేది మ్యాచ్ చూస్తే తెలుస్తుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more