‘‘లార్డ్స్’’ మైదానంలో 28 సంవత్సరాల తరువాత ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన ధోనీ సేన.. మూడోటెస్టులో మాత్రం మరీదారుణంగా ఓడిపోయింది. ఏవిధంగా అయితే రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆటగాళ్లు అద్భుతంగా ప్రదర్శించారో... అదే మూడో టెస్టుకు వచ్చేసరికి మరీ చెత్తగా విఫలమయ్యారు. మన ఇండియన్ ఆటగాళ్లు ఆడుతున్న తీరును చూసి ప్రతిఒక్కరు.. అసలు మన భారతజట్టు ఆటగాళ్లే ఇలా ఆడుతున్నారా..? అనే అనుమానాలను వ్యక్తం చేసినవాళ్లూ వున్నారు.
మూడో టెస్టులో ఇంగ్లాండ్ తో తలపడిన భారత్ ఏకంగా 266 పరుగుల తేడాతో ఘోరంగా అపజయంపాలయ్యింది. ముందుగా మొదటి ఇన్నింగ్స్ లో ఓ మోస్తరు వరకు రాణించిన బారత బ్యాట్స్ మెన్లు.. రెండు ఇన్నింగ్స్ లో చేతులెత్తేసి.. ఏమి తెలియని అమాయకుల మాదిరి కూర్చుండిపోయారు. మంచి అనుభవం కలిగిన యువఆటగాళ్లతోపాటు దిగ్గజాలు వున్నప్పటికీ.. ఎవ్వరూ తమ ప్రతిభను కనబరలేకపోయారు. చివరిరోజు అజింక్య రహానే 52 పరుగులు చేసి పోరాడినా.. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి మాత్రం ఎటువంటి సహాయం అందలేదు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు.
మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 569 పరుగులతో భారత బౌలర్లకు చుక్కులు చూపించిన అనంతరం ఆ జట్టు డిక్లేర్డ్ ప్రకటించింది. ఆ తరువాత బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు మొదట ఇన్నింగ్స్ లో కాస్త మెరుగైన ప్రదర్శనతో 330 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. అదే జోరుతో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులతో అత్యధిక ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. దీనిని ఛేజ్ చేయలేరని తెలిసి కూడా.. బారత బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడకుండా 178 పరుగులకే ఆలౌట్ అయిపోయి... పేలిపోయిన ముఖాలు వేసుకుని కూర్చున్నారు.
భారత్ - ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న మొత్తం ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు చెరొక విజయాన్ని సాధించి, సమఉజ్జీలుగా నిలిచాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో... రెండో మ్యాచ్ ను భారత్.. మూడో మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్లు గెలుచుకున్నాయి. ఇంకా మిగిలివున్న రెండు టెస్టుల్లో భారత్ రెండింటిని విజయాలుగా మలుచుకుంటే సిరీస్ చేతికి దక్కుతుంది. లేదా.. తట్టాబుట్టా సర్దుకుని తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more