గతంలో 28ఏళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ నేతృత్వంలో మొదటి విజయాన్ని సాధించిన టీమిండియా... మళ్లీ ఇన్నాళ్లకు ధోనీ నేతృత్వంలో రెండో టెస్టులో గెలిచింది. ఇందులో విచిత్రమైన విషయమేమిటంటే.... 28ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నేతృత్వంలోనే భారత్ కు తొలి వరల్డ్ కప్ లభించింది. తరువాత ఇన్నాళ్లకు ధోనీ నేతృత్వంలో రెండో ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. దీంతో ప్రతిఒక్కరు ధోనీని ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా... ధోనీ రూపంలో మరో కపిల్ దేవ్ మన భారతదేశంలో జన్మించాడంటూ ప్రతిఒక్కరు కితాబిస్తున్నారు.
భారత్ క్రికెట్ జట్టు లార్డ్స్ లో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకోవడంపై కొంతమంది ప్రముఖులు తమ ఆనందాన్ని నలుగురితో పంచుకున్నారు. ఇందులో భాగంగానే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియా గెలిచిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ... ‘‘లార్డ్స్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి గెలిచినందుకు నా అభినందనలు. మీ గొప్ప ప్రదర్శన మాకు ఎంతో గర్వకారణం. మాకు చాలా సంతోషంగా వుంది’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక భారత్ కెప్టెన్ ధోనీ కూడా... ‘‘ఇది మాకు నిజంగానే చారిత్రాత్మకమైన విజయం. ఎందుకంటే మా జట్టులో వున్న చాలామంది ఆటగాళ్లు గతంలో ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం అస్సలు లేదు. అయినప్పటికీ వారు తమ అద్భుత ప్రదర్శనతో ఇండియాను గెలిపించడంలో మంచి దృక్పథాన్ని కనబరిచారు. 2011 సిరీస్ లో మేము ఇలా ఆడలేకపోయాం. ఆ సిరీస్ మాకు మంచి పాఠాలు నేర్పించింది. దాని ప్రభావం వల్లే ఇప్పుడు నెగ్గగలిగాం’’ అంటూ తమ జట్టు గురించి ప్రశంసలు చేశాడు.
భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘చరిత్రలోనే భారత్ కు ఇది అద్భుతమైన విజయం. ధోనీ బృందానికి నా అభినందనలు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మీరు దేశం గర్వించేలా మంచి పని చేశారు. భవిష్యత్తులో ఇటువంటి విజయాలనే సొంతం మన టీమిండియా సొంతం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాట్స్!!’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అలాగే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్.. ‘‘ఇంగ్లాండ్ ను భారత్ చిత్తుగా ఓడించింది. అత్యంత పచ్చని పిచ్ పై ఇంగ్లాండ్ టాస్ గెలిచిన విషయాన్ని మరవద్దు. ఆ జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం వుంది’’ అన్నాడు. అలాగే మైకెల్ వాన్ కూడా.. ‘‘భారత్ జట్టు గెలిచినందుకు నా అభినందనలు. లార్డ్స్ లో అద్భుత విజయానికి మీరు సంపూర్ణంగా అర్హులే. అచ్చమైన ఇంగ్లీష్ పిచ్ పై ఇంగ్లాండ్ కు చుక్కలు కనిపించేలా ఓడించి, మట్టికరిపించారు’’ అంటూ మన మనసులోని మాటను వ్యక్తం చేశాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more