వాళ్లు భారత బ్యాటింగ్ దిగ్గజాలు. వాళ్లు ఎక్కడ మ్యాచ్ అడుతున్నా.. అక్కడ వేల సంఖ్యలో జనం ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఇక టీవీ పెట్లలో, ఇంటెర్ నెట్ లలో చూసే వారి సంఖ్య లక్షలు దాటుతుంది. అలాంటి ఇద్దరు క్రికెటర్లు. అందునా తమ కంటూ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేక పేజీలను రాసుకున్న వాళ్లు సాధారణ ప్రేక్షకుల మాదిరిగా మ్యాచ్ చూసేందుకు హాజరయ్యారు. అయితే ఇన్నాళ్లు వింబుల్డన్ మ్యాచ్ లకు లేని కొత్త కళ, కాంతి ఇవాళ్టి సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు సంతరించుకుకోవడంతో.. తొలిసారిగా కోర్టులో మ్యాచ్ జరుగుతున్నంత సేపు. కోర్టు బయట రెండు చోట్ల సెలబ్రిటీలను చూస్తూ అక్కడి ప్రేక్షకులు ఉబ్బితబ్బియ్యారు. ఇంతకీ వారెవరు అంటారా..?
వారే భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. శుక్రవారం నోవాక్ జోకోవిచ్, రిచర్డ్ గాస్క్వెట్ ల మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ తొలి సేమిస్ మ్యాచ్ ను వారు సాధరణ ప్రేక్షకుల మాదిరిగా హాజరయ్యారు. సచిన్ వెంట ఆయన సతీమణి అంజలి, విరాట్ కోహ్లీ వెంట ఆయన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు కూడా మ్యాచ్ వీక్షించేందుకు కిక్కిరిసన స్టేడియం మధ్య ఆసీనులై మ్యాచ్ ను తిలకించారు. అయితే వారు ఆసీనులై మ్యాచ్ ను వీక్షిస్తున్న ఫోటోలను వింబుల్డన్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్కు యూఎస్ ఓపెన్లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more