రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు(8 కిలోమీటర్ల మేరకు) 2015, మార్చిలో ఉగాది కానుకగా పట్టాలెక్కి నగరవాసులకు అందుబాటులోకి రానుందని ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. బంజారాహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన హెచ్ఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫైనల్ క్యాంపెయిన్ పోటీలను ఆయన ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోరైలుకోసం ప్రతిపాదన వచ్చిందని, దీనికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
రెండో దశలో మరో ఎనిమిది రూట్లను గుర్తించామని, కేంద్రం గ్రీన్సిగ్నలిచ్చి నిధులు మంజూరుచేస్తే ఆయా రూట్లలోనూ మెట్రోరైలు పరుగెడుతుందని తెలిపారు. హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం మెట్రోరైలు పనులపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని, ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి ఎంతో అవసరమని చెప్పారు. మెట్రోరైల్ కోచ్ నమూనాను అక్టోబర్ 2న నగరవాసులకోసం ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించారు. దీనిని నెక్లెస్రోడ్లో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. దక్షిణకొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైలు బోగీలను తయారు చేస్తోంది. ఇప్పటికే 171 బోగీలకు ఆర్డరిచ్చినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ర్యాగింగ్ భూతం
ఎట్టకేలకు ఎన్నో అవాంతరాల మధ్య ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయి ఇంజీనిరింగ్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు కాలేజీల్లో అడుకు పెట్టీ పెట్టగానే వామ్మో ర్యాగింగ్ అంటూ అడుగు ముందుకు పడకుండా విద్యార్థులను కట్టి పడేస్తోంది. ఇంటరాక్షన్ పేరుతో సీనియర్లు చేసే అరాచకానికి హద్దే ఉండడంలేదు. ర్యాగింగ్ కొందరిని మానసికంగా చంపేస్తే మరికొందరిని లోకం నుంచే సెలవు తీసుకునేలా చేసింది. వికృత రూపమున్న ర్యాగింగ్ భూతం పరిణామాలు గమనించిన ప్రభుత్వం దీనిని నిషేధించింది. ర్యాగింగ్ కు పాల్పడితే జైలే అని చట్టాలు గొంతెత్తి అరుస్తున్నా విద్యార్థుల చెవికెక్కటం లేదు. తమను సీనియర్లు చేసారనే సాకుతో జూనియర్లు కూడా సీనియర్లయ్యాక ర్యాగింగ్ పంజా విసురుతున్నారు. 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని రాష్ట్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని విద్యావేత్త మధుసూదన్ రెడ్డి తెలిపారు.
అయినా 2005 తరువాత వికృత రూపంలో రూపాంతరం చెందినదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ర్యాగింగ్ పచ్చని విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేసింది. ర్యాగింగ్ వికృత చేష్టలకు గాయపడి చదువు మధ్యలో ఆపేసిన వారు, అర్ధాంతరంగా తనువు చాలించిన వారు చాలామందే ఉన్నారు. ప్రభుత్వ చొరవతో,కాలేజి యాజమాన్యాల సహకారంతో ర్యాగింగ్ ఆగడాలకు కాస్త అడ్డుకట్ట వేయగల్గినా పూర్తిస్ధాయిలో నిరోధించలేకపోయింది. ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపాలన్న సుప్రీం ఉత్తర్వులను లెక్కచేయకపోవడం కూడా ఈ పర్యవసానాలకు కారణం.అయితే పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ర్యాగింగ్ దుష్ర్పభావం కాలేజి యాజమాన్యాలు తక్కువేనంటున్నాయి . మన రాష్ట్రంలో ర్యాగింగ్ మహమ్మారి అంతగా విస్తరించకపోయి ఉండొచ్చు. కాని ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే యాజమాన్యాలు,పోలీసులు,ప్రభుత్వాధికారులు సంయుక్తంగా యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ ను నిర్వహించాలి. అప్పుడే భావితరాల బంగారు భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more