రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి 'ఇందిరమ్మ బాట' కార్యక్రమాన్ని 2012 జూలై 14న తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కిరణ్ సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని ప్లాన్ వేశారు. అయితే 'ఇందిరమ్మ బాట' కార్యక్రమానికి లాంగ్ బ్రేక్ పడింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 'ఇందిరమ్మ బాట'కు బ్రేక్ లు పడ్డాయి. 12 జిల్లాల్లో ఇందిరమ్మ బాటను నిర్వహిస్తున్నారు. 2013 వరకు జరిగే లాంగ్ షెడ్యూల్ ను కిరణ్ సర్కార్ విడుదల చేసింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని నిర్వహించాల్సివుంది. అయితే 'ఇందిర బాట'ను అన్నీ జిల్లాల్లో నిర్వహించేదుకు కిరణ్కు పరిస్థితులు కలిసి రావటం లేదు. 12 జిల్లాలో మాత్రమే ఇందిరమ్మ బాటను ప్రారంభించగలిగారు. మరో 11 జిల్లాలో నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి లాంగ్ బ్రేక్ పడింది. రెండో విడత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు, చలో అసెంబ్లీ కార్యక్రమం, రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చిత రాజకీయ పరిస్థితులతో గ్యాప్ ఏర్పడింది.పంచాయితీ ఎన్నికల తర్వాతైన మిగతా జిల్లాల్లో 'ఇందిరమ్మ బాట'ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more