ప్రతిఒక్కరు కలలు కనడం సర్వసాధారణం! జీవితంలో ఏదో ఎత్తుకు చేరిపోవాలని అందరూ ఆకాంక్షిస్తారు కానీ.. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణాలు వారిని ఆ స్థాయికి చేరుకోవడంలో అడ్డుపడుతాయి. వాటిని అధిగమిస్తేగానీ వారు తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. లేదా ఆ కలలు నెరవేరవరకు ఎంతో ఓపికగా కాలం గడుపుతూ వుండాలి. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి ఆ కలలు తీరే సమయం వచ్చిందనుకోండి.. ఆ ఎగ్జైట్ మెంట్ ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! అటువంటి క్షణాలు ఇప్పుడు కత్రినా జీవితంలో వచ్చాయి. ఎంతోకాలంగా ఆమె చేస్తున్న నిరీక్షణ ఎట్టకేలకు తీరే సమయం ఆసన్నమవడంతో ఆమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. గతకొన్నాళ్ల నుంచి వరుస సినిమా, వాణిజ్య ప్రకటనల షూటింగులతో తీరిక సమయం లేకుండా బిజీగా వున్న కత్రినా.. ఇప్పుడు వాటినుంచి విరామం తీసుకుని తన చిరకాల వాంఛను తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ కోరిక ఏంటని అనుకుంటున్నారా..? మరేం లేదు.. ఈ అమ్మడికి కేన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడవాలనే కోరిక ఎప్పటినుంచో వుంది. గతంలో ఈ విషయాలు చాలాసార్లు తెలియజేసింది. అయితే.. ఆ అవకాశం ఆమెకు ఎప్పటికీ రాలేదు. అయితే.. ఇప్పుడు ఆ అవకాశం రావడంతో అమ్మడు ఆ ఎగ్జైట్ మెంట్ ని తట్టుకోలేకపోతోంది. ఈ ఫెస్టివల్లో తొలిసారి కార్పెట్ పై నడవనున్న కేట్.. అందాల భామ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ లతో కలిసి వాక్ చేయనుంది. దీంతో ఈ సెక్సీ భామ సంబరిపడిపోతోంది.
ఈ నేపథ్యంలోనే కేట్ మాట్లాడుతూ.. ‘లోరియల్ పారిస్, భారత్ తరఫున ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్ లో ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా ఎగ్జైట్ గా వుంది. ఈ ఫెస్టివల్ లో లొరియల్ కు చెందిన ఇతర అంబాసిడర్లను కలుసుకునే అవకాశం వుంది. అందుకే.. ఇక ఆగలేకపోతున్నాను’ అని అంటోంది. ఇదిలావుండగా.. భారత్ లో లోరియల్ కు ఐష్, కత్రినా, సోనమ్ లు అంబాసిడర్లుగా వున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురు కలిసి కేన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై ఆ బ్రాండ్ తరఫున సందడి చేయనున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more