పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ , స్వయంగా రెండవ ఎస్సార్సీ తేనెతుట్టెను కదపడంతో పార్టీ లో చర్చీనీయాంశమయింది. బొత్స మాటలపై టీఆర్ఎస్, జాక్ విరుచుకుపడ్డాయి. అదే సమయంలో టీఆర్ఎస్ , టీ కాంగ్రెస్ ఇరుకునపడ్డాయి. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ చివరకు తాను ఏదీ అనకుంటే అదే చేస్తుందని బొత్స చెబుతున్నారు. మూడు ప్రాంతాల నేతలతో చర్చలు, ఏకాభిప్రాయ సేకరణ, మెజారిటీ ప్రజల అభిప్రాయాలు , యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చల పేరుతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తూ రాజకీయ పార్టీలను ప్రజలను రెండుగా నిలువునా చీల్చిగా కాంగ్రెస్ నాయకత్వం.. చివరకు 2004 లో నాటి టీఆర్ఎస్ లో నేత ఆలె నరేంద్ర సంతకం చేసిన రెండవ ఎస్సార్సీ ఒప్పందాన్ని మరల బొత్స తెరపైకి తీసుకొచ్చారు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటని అని గతంలో బొత్స చెప్పిన మాటలే . అయితే మళ్లీ ఇప్పుడు రెండో ఎస్సారీ అనటం పార్టీ లోని తెలంగాణ నాయకులు మండి పడుతున్నారు. తెలంగాణ తాను రెండవ ఎస్సార్సీ వైపే మొగ్గుతానని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. అయితే సడన్ గా సత్తిబాబు రెండవ ఎస్సార్సీ ప్రస్తావన తీసుకురావడం వెనకు అసలు అంతర్యం అదేనని స్పష్టమవుతుంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో రెండవ ఎస్సార్సీని ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం, ఆంద్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుధ్దంగా ఎలా వ్యవహరిస్తుందని ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఓ తెలంగాణ నేతతో కాంగ్రెస్ అగ్రనేత ఒకరు ప్రశ్నించినట్లు ఢిల్లీ నాయకులు అనుకుంటున్నారు.
మళ్లీ రెండవ ఎస్సార్సీ అంటే మళ్లీ తెలంగాణ అంశాన్ని నాన్చడమేనన్న అభిప్రాయం, అనుమానం తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతుంది.ప రెండవ ఎస్సార్సీ అనేది ఎన్ని రాష్ట్రాల్లో వేయాలి? ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్న అన్ని రాష్ట్రాల్లో వేయాలి? లేక మన రాష్ట్రానికే దాన్ని పరిమితం చేయాలా? చేస్తే అందులో ప్రధాన అంశాలు, అజెండా ఏమిటన్నది నిర్థరించేందుకు ఎంతకాలం పడుతుందో కూడా తెలియదని, ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకత్వం రెండవ ఎస్సార్సీ పేరిట తమ గళం నొక్కే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనపై రెండోవ ఎస్సార్సీ నే అంటే అది కాంగ్రెస్ కు మరణశాసనమే అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఆత్మార్పణ చేసుకోవలసిందే తెలంగాణ వాదులు అంటున్నారు.తెలంగాణ ఇచ్చేదీ తెచ్చేదీ మేమేనని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు రెండవ సారీ ఎస్సీర్సీ అంటే చచ్చేది కూడా కాంగ్రెసేనని కేసిఆర్ తనయుడు కేటీఆర్ అన్నారు.ఇటీవల నెల రోజు ఢిల్లీలో ఉండి బాగా ఎంజాయ్ చేసిన కేసిఆర్ . ఢిల్లీ నాయకులైన వయలార్ రవి, ఆజాద్, ఆస్కార్ ఫెర్నాండేజ్ సుధీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆజాద్ కాశ్మీర్ లో, వయలార్ రవి ఢిల్లీ తెలంగాణ కు వ్యతిరేక సంకేతాలు ఇచ్చినప్పుడు కేసిఆర్ మౌనం పాటించాడు. వారి మాటలను ఖండించలేదని ..ఢిల్లీ నాయకులు అంటున్నారు. రీసెంట్ గా ఢిల్లీ నాయకుడు అయిన గులాం నబీ అజాద్ హైదరాబాద్ వచ్చి తెలంగాణ పై ఏకాభిప్రాయం అవసరమని , మిగిలిన రాష్ట్రాల మాదిరిగద రాష్ట్ర విభజన అంత సులభం కాదని మీడియా ప్రకటన చేసినప్పుడు కూడా కేసిఆర్ ఇప్పడి వరకు ఖంఢిలేదని తెలంగాణ నాయకులు గోల చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సైతం రెండవ ఎస్సార్సీ అనే మాట వాడగానే టీఆరఎస్ కు శరాఘాతంలా పరిణమించింది. ఢిల్లీ లో బొత్స – కేటీఆర్ మంతనాలు చేసిన విషయం తెలిసిందే. అయితే తండ్రితో పాటు ఢిల్లీ చర్చలో పాలుపంచుకున్న కేసిఆర్ తనయుడు కేటీఆర్ నాడు ఆజాద్ , రవి వ్యాఖ్యల్ని ఖండించే దమ్ములేదు గానీ, బొత్స వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా ఖండించటం చాలా ఘోరమైన విషయంగా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బొత్స మాటలు వెనక నిజంగా దాగిన మాట వాస్తవమే? ఇటీవల ఢిల్లీకి వెళ్లిన బొత్సకు తెలంగాణ పై అధిష్ఠానం మనోగతం తెలుసుకున్న తర్వాతే రెండవ ఎస్సార్సీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సత్తిబాబు నోట సడన్ గా రెండవ ఎస్సార్సీ మాట వచ్చిందంటే తెలంగాణ వాదులు ఒక్కసారి ఆలోచించుకోవాలి? తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పు ఏంటీ ? అని అడిగిన బొత్సను తెలంగాణ నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలి? సత్తిబాబు మాటల్లో నిజాన్ని తెలుసుకోండి? ఆవేషంగా, అనార్థాలు తీసుకోండి? తెలుగు ప్రజలు బాగుండాలి అనే వారిలో సత్తిబాబు ఒకరు?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more