ఇప్పుడు ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బెర్గ్ కు పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పటి వరకు మార్క్ జుక్ బెర్గ్ కొంత మందికి మాత్రమే తెలుసు. కానీ ఒక అవినీతి పరుడు వలన ఫేస్ బుక్ ఓనర్ పేరు సామన్య ప్రజలకు కూడా తెలియటం విశేషంగా ఉంది. ఇప్పుడు ఎవరి నోట విన్న జుకర్ బెర్గ్ గురించి అవినీతి పరుడు గురించి తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారట. అవినీతి పరుడు ఒక సోషల్ నెట్వర్కింగ్ టెక్నిషియన్ తో తో పోల్చుకోవటం చాలా బాధకరమని మేథావులు అంటున్నారు.
అసలు మార్క్ జుకర్ బెర్గ్ఎవరు? ఇతనికి ఆంధ్రప్రదేశ్ అవినీతి పరుడికి సంబంధం ఏమిటి? జుకర్ బెర్గ్తో అవినీతి పరుడు ఎందుకు పొల్చుకున్నాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు మేథావులు వేధిస్తున్నాయాట.
మార్క్ ఎలియట్ జుకర్ బెర్గ్ 1984 న జన్మించాడు. ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు అంతర్జాల వ్యవస్థాపకుడు. అతను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సృష్టికర్తగా సుపరిచితుడు, ఇప్పుడు దానికి తను ప్రధాన కార్యనిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దానిని జూకర్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు తన సహా విద్యార్థులు అయిన డస్టిన్ మోస్కోవిత్జ్, ఎడ్వర్డో సవేరిన్, మరియు క్రిస్ హుఘ్స్తో కలిసి 2004 లో ఒక ప్రైవేట్ సంస్థగా సహ-స్థాపించాడు. జుకెర్ బర్గ్ ని 2010లో "పర్సన్ అఫ్ ది ఇయర్"గా టైమ్ మ్యాగజైన్ ఎన్నుకుంది. తన వ్యక్తిగత సంపద $ 17.5 బిలియన్ తో అతన్ని ప్రపంచంలో అతి చిన్న కోటీశ్వరులలో ఒకనిగా ఉన్నట్లు అంచనా జరిగినది.
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సృష్టికర్తగా ఎదగటానికి 9 సంవత్సరాలు కష్టపడితే గానీ ఈ రోజు ఫేస్ బుక్ ప్రపంచలో ఒక సోషల్ నెట్ వర్క్ గా పనిచేస్తుంది. ఇప్పుడు జుకర్ బెర్గ్ కనిపెట్టిన సోషల్ నెట్ వర్కు వలన ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఎక్కడ ఏం జరుగుతుంతో, తమ సొంత ఇంట్లో జరిగే ఫంక్షన్ లు కూడా కొన్ని నిమిషాలలోనే ఇతర దేశాలల్లో ఉన్న తమ బంధువులకు తెలిసిపోతుంది. ఈ రోజు ఉదయం నుండి చేసిన పనులుతో సహ అమెకారిలో ఉన్న తమ, అన్న, తమ్ముళ్లు ఇట్టే తెలిసిపోతుంది. ఇదంతా కేవలం ఒక ఫేస్ బుక్ వలనే జరుగుతుంది. ఈ ఫేస్ బుక్ వలన ప్రజలు ఏన్నో విధాలుగా లాభాం పొందుతున్నారు. ఈ లాభం పొందుతున్న ప్రతి ఒక్కరి ఈ ఫేస్ బుక్ ఓనర్ తెలియక పోవచ్చు. కానీ ఆయన సృష్టించిన ఫేస్ బుక్ మాత్రం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కర్ని అనుసందనం చేయటానికి జుకర్ బెర్గ్ కు 9 సంవత్సరాలు పట్టింది. ఆయన పేరు తెలియకపోయిన .. ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ వలన ఎంతో ఆనందపడుతున్నారు.
జుకర్ బెర్గ్ కు 9 సంవత్సరాలు కష్టపడితే.. ఆయనకు 26 శాతం వాటా ఫేస్ బుక్ ఉంది. అంటే 20 బిలియాన్ల డాలర్లు అన్నమాట. మన కరెన్సీ ప్రకారం సుమారుగా లక్ష కోట్లు ఉంటుందని మేధావులు అంచన. ఇంత గొప్ప ఘనత సాధించిన వ్యక్తి మార్కు జుకర్ బెర్గ్ తో ఆంధ్రప్రదేశ్ అవినీతి పరుడైన జగన్ పోల్చుకోవటంలో చాలా విడ్డురంగా ఉందని ప్రపంచ మేథావులు అంటున్నారు.
ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలకు వైఎస్ జగన్ పేరు పాకిపోయింది. అది అవినీతి పరంగా లేండి, మరో విధంగా కాదు? ఇప్పుడు వైఎస్ జగన్, నాకంటే ఫేస్ బుక్ ఓనర్ గొప్పా? అని ప్రపంచ మేథావులను ప్రశ్నిస్తున్నడట. ఈ ప్రశ్నకు ప్రపంచ మేథావులు ముక్కున ఏలేసుకుంటున్నారట. అసలు జగన్ కు ఫేస్ బుక్ మార్కు జుకర్ బెర్గ్ కు చాలా తేడా ఉందని అంటున్నారు.
ఇప్పుడు బ్లాగ్ ల్లో , ఫోరమ్స్ లలో ..జగన్ అనుచరలు ఇలా అనుకుంటున్నారట. ఫేస్ బుస్ ఓనర్ మార్క్ జుకర్ బెర్గ్ కంటే జగనే గొప్పని చెప్పుకుంటున్నారట. మార్క్ కంటే జగన్ గొప్ప అనే విషయాన్ని బ్లాగ్ ల్లో చర్చించుకుంటున్నారు .
అదే విధంగా జగన్ ఫేస్ బుక్ ఓనర్ తో పోల్చుకోవటం చాలా నీచంగా ఉందని మేథావులు అంటున్నారు. అసలు జగన్ ప్రజలకు చేసింది ఏమిటి? జగన్ ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడ్డాడు? అంటే .. జగన్ తండ్రి పేరు చెప్పుకొని, అవినీతి సామ్రాజ్యానికి రాజు అయ్యాడని మేథావులు అంటున్నారు.
వైఎస్ జగన్ లక్ష కోట్లు సంపాదించటానికి కేవలం మూడు, లేదా నాలుగు సంవత్సారలు పట్టిందట. ఈ మూడు, నాలుగు సంవత్సారాలలో .. తండ్రి పేరు అడ్డం పెట్టుకొని 20 జీవోలు ఇచ్చి అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని , మేథావులు అంటున్నారు. తన సొంత బావను బ్రదర్ అనిల్ గా మతం మార్చి .. ఆయనకు కొన్ని కోట్లు విలువ చేసే గనులు కేటాయించిన ఘనత జగన్ కే దక్కుతుందని వారు అంటున్నారు. అలాగే వాన్ పిక్ పేరుతో, మ్యాట్రిక్ మ్యాజిక్ చేసే నిమ్మ గడ్డ ప్రసాద్ కు కొన్ని వేల ఏకరాల భూమి ఇచ్చి కోట్లు దంటుకున్న ఘనత వైఎస్ జగన్ దేనని అందరి తెలుసు.
వైఎస్ జగన్ చేతిలో ఐఏఎస్ ఆధికారులకు బలైన విషయం ఎవరికి తెలియదు? కోనేరు ప్రసాదు, ఎమ్మార్ ప్రపర్టీస్ లో ఇరికించి, తక్కువరేట్లకు విక్రయించి అందులో కొన్ని వేల కోట్లు డబ్బును వెనకవేసుకున్న విషయం అందరి తెలుసిందే. అలాగే జగన్ ఉచ్చులో చిక్కుకున్న ఐఏఏస్ అధికారి శ్రీలక్ష్మీ జైలుకు వెళ్లటం వెనక జగన్ పాత్ర చాలా దాగి ఉందని మేథావులు అంటున్నారు. క్రిష్టియన్ మతస్థుడైన కరుణాకర్ రెడ్డిని తిరుపతి చైర్మన్ గా చేసి .. తిరుమలను అపవిత్రం చేసిన ఘనత వైఎస్ కుటుంబానిదే కదా, అలాగే తన మేనమామ అయిన రవీంద్ర రెడ్డి కి ఎరువుల మిక్సింగ్ చేసుకోమని చెప్పి.. రైతులకు ఇచ్చే ఎరువులలో కుంభకోణం చేసి కోట్లు సంపాదించిన విషయం ప్రజలకు తెలియాదా? అంతేకాకుండా సున్నాపురాయి ఉన్న నేలను కేవలం తక్కువ రేటుగే ఇవ్వలేదా? అలాగే ప్రసాద్ ల్యాబ్ కు 10 వేల ఎకరాలు ఇచ్చింది జగనే.
నేను ఏం చేస్తున్న ప్రజలందరికి తెలుసు, నా ప్రజల ఆదరణ ఉంది, నేను ప్రజల కోసం ఏమి చేయకపోయిన ప్రజలు నాకు సీఎం సీటు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అదే జూక్ బర్గ్ 9 సంవత్సరాలు కష్టపడి ఏం సాదించాడు. నాలాగా , ప్రజాదారణ లేదు, ప్రజల అభిమానం లేద, నా లాగా ముఖ్యమంత్రికి ఫోటీ చేయ్యగలడా అని జగన్ ప్రపంచ మేథావులను జగన్ ప్రశ్నిస్తున్నాడట.
ఫేస్ బుక్ మార్కు జుకర్ బెర్గ్ కంటే జగనే గొప్ప అంటు , జగన్ అనుచరులు ప్రజల మధ్య కొత్త నినాదం చేస్తున్నాడట. జగన్ అనుచరులు చేస్తున్న కొత్త విధానం చూసి చదువుకున్న యువకులు, మేథావులు, రచయితలు, ఉద్యోగులు, ఆశ్చర్యంతో ఆలోచనలు చేస్తున్నారట .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more