ఇటీవల కాలంలో కేసిఆర్ కూతురు రాజకీయలపై మక్కువ చూపిస్తుంది. నిన్నటి వరకు అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ అంబ్కేదకర్ విగ్రహం కోసం ఆమె 48 గంటల దీక్ష చేసి కొంత రాజకీయ బలం పెంచుకున్నారు. ఈ దీక్ష వలన తెలంగాణ ఉన్న ఎస్సీ కులాలకు చేరువాటం కోసమే ఆమె దీక్ష చేసిందని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ అంటూ.. ప్రభుత్వం అప్పడప్పుడు విరుచుకుపడుతున్న మందా క్రిష్ణ మాదిగాకు చెక్ పెట్టేందుకు కేసిఆర్ వేసిన ప్లాన్ అని టీఆర్ఎస్ నాయకలు అంటున్నారు. ఇప్పుడు అదే బాటలో.. తెలంగాణకు చెందిన మరో నాయకుడకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతుందని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
2014లో జరగ నున్న సార్వత్రిక ఎన్నికలకు ఎవరి స్థాయికి తగ్గ సీట్లను వారు ఎంపిక చేసుకుని కర్చిఫ్ వేసే ప్ర యత్నాలు రాష్ట్రంలో జోరందుకుంటున్నాయి. విశా ఖపట్నం నుండి నిజామాబాద్ వరకు ఇదే పరిస్థితి నెలకొంటోంది. తెలంగాణవాదానికి గుండె కాయగా భావిస్తున్న నిజామాబాద్ లోక్సభ స్థానంపై తా జాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దృష్టి సారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ స్థానంలో ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీగౌడ్కు చెక్ పెట్టేందు కు కవిత చకచకా పావులు కదుపుతున్నట్లు తెలు స్తోంది. 2009 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో వలం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏనుగు రవీందర్రెడ్డి మినహా మరెక్కడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవని పరిస్థితి.
కానీ ఇటీవల సకల జనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడం, మరో పక్క విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలు చేసుకుంటుండడంతో వాదం.. సెంటిమెంటు మరింత బలపడుతూ వస్తోంది. కాగా అటు కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ రెండు సార్లు గెలిచినప్పటికీ తెలంగాణ అంశంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి ఆయన్ను ఇరకాటంలో పెడుతోందంటున్నారు. అంతేకాకుండా యాష్కీ కూడా ఇప్పటికే ఇటు, అటు తెలంగాణవాదుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కవిత ఇదే అదునుగా యాష్కీకి చెక్ పెట్టేందుకా? అన్నట్లు నిజామా బాద్ లోక్సభ స్థానంలో పోటీపై ఆరా తీస్తున్నట్లు తె లియవచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా నిజా మాబాద్లో మధుయాష్కీకి ధమ్కీలు ఇస్తోంది. అ సెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్న డిమాండ్తో 48 గంటల దీక్ష తనకు ప్లస్ అవుతుందని కవిత భావిస్తున్నట్లు సమాచారం.
దీనికి తోడు దళిత ఓటు బ్యాంకు టీఆర్ఎస్కు పేటెంట్గా ఉం దంటున్నారు. తెలంగాణ వస్తే దళితుణ్ణి సీఎం చేస్తానంటూ కేసిఆర్ ప్రకటన చేసిన దరిమిలా దళి త వర్గాల్లో కొంత సానుకూల వాతావరణం ఉం టుందన్న భావన వ్యక్తం అవుతోంది. కవిత టీఆర్్ఎస్ నుండి పోటీ చేస్తుందా? జాగృతి నుండి బరిలో నిలుస్తుందా? అన్న అంశం ఇంకా తేలకపోయినా పోటీ చేయడం మాత్రం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి కేసిఆర్తో సంప్రదించి టీఆర్ఎస్ టిక్కెట్లు దక్కించుకుని నిజామాబాద్లో పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకంటే ముందు మధు యాష్కీగౌడ్ కేవలం ఎన్ఆర్ఐ మాత్రమే. అప్పట్లో చేనేత ఆత్మహత్యలతో పాటు రైతు ఆత్మహత్యలూ ఎక్కువగా జరిగేవి. వర్షాలు లేక పంటపొలాలు ఎండిపోతుంటే దిక్కుతోచని రైతులు అప్పులుచేసి బోర్లు వేసేవారు. ఆ బోర్లలో నీళ్లు పడకపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసు కునే వారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచా రెడ్డి మండలం రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పట్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రెండు నుండి నాల్గు లక్షల వరకు ఆర్థిక సాయం చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మధుయాష్కీ ఇప్పుడు తెలంగాణ కోసం ఎందరో వి ద్యార్థులు, యువకులు సూసైడ్ నోట్లు రాసి మరీ చనిపోతున్నా ఒక్కరికి కూడా సాయం అందించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలుచుకునేందుకు కల్వకుంట్ల కవిత ప్ర యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more