నన్ను తక్కువ అంచనా వేయవద్దు.. మీ సంగతి చూస్తా! అంటూ సీఎంపై పీసీసీ చీఫ్ విరుచుకుపడ్డట్లు తెలిసింది. ఆ వెంటనే స్వరాన్ని పెంచిన బొత్స.. నీకు నువ్వు ఏమనుకుంటున్నావ్? నా గురించి ఏమని భావిస్తున్నావ్ సీఎం? నీ సంగతేంది? నీ వ్యవహారం ఏంది? అధిష్ఠానం వద్ద తాడోపేడో తేల్చుకుంటాను, అందర్నీ కేసుల్లో ఇరికించి మీరు బాగుపడదామనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? అని కిరణ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దీంతో, దిగ్భ్రాంతి చెందిన సీఎం కిరణ్ అసలు ఈ ఉదంతమే తనకు తెలియదని, ఏసీబీపై తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదని బొత్సకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ? నన్ను నమ్మండి. మీరవన్నీ ఎలా విశ్వసిస్తారు ' అని కిరణ్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం, బొత్స మధ్య మాటల యుద్ధమే జరిగిందని తెలిసింది.
అసలు నువ్వెంత... నీ లెక్కెంత , నా గురించి ఏమనుకుంన్నారు? నన్ను తక్కువ అంచనా వేయొద్దు , మీ సంగతేందో నేనూ చూస్తా , మద్యం కేసులపై సత్తిబాబు ఫైర్ ఆ ఉదంతం గురించే నాకు తెలీదు నన్ను నమ్మండి అంటున్న కిరణ్ .
ఆజాద్ను కలుసుకున్న బొత్స మద్యం దుకాణాల వ్యవహారంలో కిరణ్ తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ సీఐ గణేశ్ పంపిన లీగల్ నోటీసు ప్రతిని తన వాదనకు మద్దతుగా ఆజాద్కు పీసీసీ చీఫ్ అందజేసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలందర్నీ కలుపుకొని, ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన ముఖ్యమంత్రే పార్టీలో నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆజాద్కు బొత్స చెప్పినట్లు తెలిసింది.
అంతేకాకుండా దీని వెనక మరొ నాయకుడు ఉన్నాడని, అతన ఎవరో కాదు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ రావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎంపీలతో ఆజాద్ ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణకు ఇవ్వాలంటూ పార్టీ నేత దామోదర్ రెడ్డి ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో.. పొన్నాల ఢిల్లీలో తన ప్రయత్నాలు ప్రారంభించారని, ఇందుకు సీఎం ఆశీస్సులు కూడా ఉన్నాయని బొత్స వర్గం అనుమానిస్తోంది. ఇలా ఒకర్నొకరు దెబ్బతీసుకునేందుకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు పావులు కదపడం చర్చనీయాంశమవుతోంది.
వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలయ్యేంత వరకూ ఓపిక పట్టవలసిందిగా బొత్సను ఆజాద్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో తన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని ఎసిబి సిట్ అదనపు డైరెక్టర్ సిఐని వేధించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్సకు మధ్య విభేదాలు మరింత పెరిగాయి. శ్రీనివాస రెడ్డి వ్యవహారం వెనక ముఖ్యమంత్రి ఉన్నారని అనుమానించిన బొత్స ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ముఖ్యమంత్రిపై బొత్స తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. తనకు ఆ వ్యవహారం తెలియదని ముఖ్యమంత్రి ఎంత చెప్పినా బొత్స వినలేదని అంటున్నారు. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలందర్నీ కలుపుకొని, ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన ముఖ్యమంత్రే పార్టీలో నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆజాద్కు బొత్స చెప్పినట్లు తెలిసింది.
కాగా, ఉప ఎన్నికలను జూన్లోపే నిర్వహించాలని తాము భావిస్తున్నామని, అందుకు తగిన వ్యూహరచనను ప్రారంభించామని, ఎంపీలతో చర్చలు జరుపుతున్నానని బొత్సకు ఆజాద్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. "ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సీఎంకి చెబుతాం. మీరు ఈ విషయం రచ్చచేయకుండా జూన్లో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగండి అని బొత్సను ఆజా ద్ బుజ్జగించినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more