2014 ఎన్నికల నాటికి తెర పైకి .. మరొ కొత్త పార్టీ వస్తుంది. అది బీసీ పార్టీ. బీసీలు ఎప్పటి నుండి పార్టీ పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నారు . కానీ వారి వద్ద పార్టీ పెట్టడానికి సరియైన నిధులు లేక ఆగిపోయినట్లు తెలుస్తుంది. గతంలో చిరు పార్టీ పెట్టే సమయంలో బీసీ నాయకలను కలిసి తమ పర్టీ మద్దతు ఇవ్వండి అని చిరు అడిగినప్పుడు బీసీ నాయకులు విముఖత చూపటం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ అలాంటి బీసి నాయకులే.. త్వరలో పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తుంది. అసలు బీసీ ఇంత బలపడటానికి కారణం వైఎస్ జగన్ . జగన్ అండదండలతో.. బీసీ పార్టీ తెరపైకి వస్తుందని ప్రజలు అంటున్నారు. బీసి పార్టీ కావలసిన నిధులను .. వైఎస్ జగన్ .. సమకుర్చినట్లు తెలుస్తుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 64 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో నేటికీ బీసీని సీఎంగా నియమించలేదని, అయితే 2014 ఎన్నికల తర్వాత మాత్రం బీసీనే సీఎం పీఠాన్ని అధిష్టిస్తాడని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికలు-ఫలితాలు.. బీసీలు’ అనే అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మేధావులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. యూపీలో బీసీలు గెలవడం సంతోషించదగ్గ విషయమని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయాన్ని ప్రచారం చేస్తామన్నారు.
బీహార్లో లాలూపోతే నితీష్... యూపీలో మాయావతి కాకుంటే ములాయం వస్తున్నారు.. కానీ అగ్రవర్ణాలకు మాత్రం అధికారం ఇవ్వ డం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా పార్టీలు ఉన్నాయని, బీసీలకు మాత్రమే పార్టీ లేదన్నారు. ‘చాలా మంది నీవు పార్టీ పెడతావా, మమ్మల్ని పెట్టమంటావా..’ అని తనపై ఒత్తిడి తెస్తున్నారని, బీసీల ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కృష్ణయ్య చెప్పారు. సరైన సమయం కోసం వేచి చూశామని, ఇప్పుడు అది ఆసన్నమైందని చెప్పారు.
ఇప్పుడు వైఎస్ జగన్ అండతో బీసీలు పార్టీ పెట్టడం వెనుక జగన్ స్వార్థ రాజకీయం కూడా ఉందని .. అంటున్నారు. ఎందుకంటే .. రాష్ట్రంలో.. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. జగన్ కు కాంగ్రెస్ పార్టీ వల్ల పెద్ద నష్టం లేదని తెలుస్తుంది. ఎందుకంటే.. ఆ పార్టీలో ఎక్కువ మంది రెడ్డి వర్గం వారు ఉండటం జగన్ కు ప్లస్ పాయింట్. అంటే ఏదోఒక రోజు వారు జగన్ గూటికి వస్తారని ఆయన ఆశ. ఇక రెండవ పార్టీ తెలుగుదేశం... ఈ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్నది బీసీలే. ఇప్పుడు ఆ బీసీలను.. విడగొట్టితే.. తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది. ఆ తరువాత.. బీసీలను తన పార్టీకి లిక్ ఇచ్చుకొవచ్చునని.. జగన్ ఆలోచనట. అంతేకాకుండా.. రాష్ట్రంలో.. దళిత వర్గం అయిన ఎస్సీలు, ఎస్టీలను.. జగన్ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారని తెలిసింది.
మొదటిగా .. ఎమ్మార్సీస్ వ్యవస్థాపకు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కూడా జగన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి జగన్ పార్టీ మాల వర్గం ఉంది. ఇక మాదిగ వర్గం కూడా తోడైతే.. జగన్ పూర్తి బలం చేకూరినట్లేనని చెబుతున్నారు. అందుకోసం .. 2014 ఎన్నికల లోపు.. మందకృష్ణ మాదిగతో కూడా కొత్త పార్టీ పెట్టిస్తాడనే సమాచారం వినిపిస్తుంది. అందుకు కావలసిన.. పనులను జగన్ దగ్గర ఉండి చేయిస్తానడని .. పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
అంటే 2014 లో యూపీలో అఖిలేష్ లా .. ఇక్కడ వైఎస్ జగన్ కూడా గెలుస్తున్నాడని.. 2014లో కాబోయే సీఎం జగనే అని పార్టీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more