Chiranjeevi's Waltair Veeraiah shedule to begin in Hyderabad చిరంజీవి ‘వాల్తేరు వీర‌య్య’ మెగా షెడ్యూల్ ప్రారంభం..!

Mega shedule of chiranjeevi s waltair veeraiah to begin in hyderabad

Waltair Veerayya, Waltair Veeraiah, Megastar, Chiranjeevi, Mass Maharaj, Raviteja, Shruti Haasan, Rajendra Prasad, Vennela Kishore, Chiranjeevi Ravi teja, Chiranjeevi Waltair Veeraiah, Chiranjeevi Waltair Veerayya, Chiranjeevi Shruti Haasan, KS Ravindra, Bobby, Tollywood, Movies, Entertainment

Helmed by K. S. Ravindra, Waltair Veerayya, which was tentatively titled Mega 154, will star Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Bobby Simha and Catherine Tresa in key roles. Actors Rajendra Prasad and Vennela Kishore will also be seen playing supporting roles in this upcoming Telugu action film produced by Mythri Movie Makers.

చిరంజీవి ‘వాల్తేరు వీర‌య్య’ మెగా షెడ్యూల్ ప్రారంభం..!

Posted: 09/03/2022 04:02 PM IST
Mega shedule of chiranjeevi s waltair veeraiah to begin in hyderabad

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తూ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తొలి చిత్రం ఆచార్య ప్రేక్షకుల అంచనాలతో పాటు మెగా అభిమానుల అంచనాలను కూడా బాగా దెబ్బతీసింది. ఈ క్ర‌మంలో చిరు త‌న త‌దుప‌రి చిత్రాల‌పై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్ర‌స్తుతం చిరు రెండు సినిమాల షూటింగ్‌ ఏక‌కాలంలో జ‌రుపుతూ యువ హీరోలకు పోటీని ఇస్తున్నాడు. అందులో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వాల్తేరు వీర‌య్య ఒక‌టి. యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుప‌కుంటుంది.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. తాజాగా హైద‌రాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్‌లో కీల‌క ఘట్టాల‌ను తెర‌కెక్కించ‌నున్నార‌ని చిత్రపురిలో వార్తలు వినబడుతున్నాయి‌. ఈ షెడ్యూల్‌లో ర‌వితేజ కూడా పాల్గొన‌నున్నాడ‌ని సమాచారం‌. కాగా ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు బాబీ తండ్రి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే షూటింగ్ త‌న వ‌ల్ల ఆగిపోవ‌ద్ద‌నే ఉద్దేశంతో బాబీ కొత్త‌ షెడ్యూల్‌ను ప్రారంభించడం గొప్ప విష‌యం అనే చెప్పాలి.

ఈ చిత్రం ‘ముఠా మేస్త్రీ’ త‌ర‌హా మాస్ యాంగిల్‌లో అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ ను కూడా నచ్చేట్టుగా కథను, కథనాన్ని దర్శకుడు బాబి రూపోందించుకున్నారు. ఇక ఇప్పటికే అందుతున్న లీకులకు తోడు ఈ చిత్ర పోస్ట‌ర్ల‌ను చూసినా.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతోంది. చిరు ఈ సినిమాలో అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నాడు. విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మాస్‌రాజ ర‌వితేజ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెర‌కెక్కుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles