కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక సర్కారువారి పాట, ఫర్వాలేదని అనిపించినా.. ఆచార్య అంచనాలను అందుకోలేకపోయినా.. అభిమానులను మాత్రం అలరించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లో ప్రతివారం ఓ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా విడుదల తేదీపై క్లారిటి ఇవ్వటం లేదు. ఆ సినిమానే ‘విరాట పర్వం’.
అయితే ఇప్పుడు ఆ చిత్రం విడుదలపై కూడా క్లారిటీ వచ్చేసింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నీదినాది ఒకేకథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ మూవీని అన్ని చిత్రాలతో పాటే వాయిదా వేశారు. మిగితా చిత్రాలు వరుసగా విడుదల అవుతుంటే, విరాట పర్వం మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేకపోతుంది. దీనికి ముఖ్య కారణం సరేష్బాబు అంటూ ప్రచారం సాగింది. సురేష్బాబు నారప్ప, దృశ్యం సినిమాల మాదిరిగానే విరాట పర్వం చిత్రాన్ని కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు గతం నుంచి ప్రచారం అవుతుంది.
అయితే ఈ వార్తలపై కూడా ఎలాంటి స్పష్టత అధికారికంగా లేకపోయినా.. చిత్రం విడుదలపై సస్పెన్స్ కొనసాగింది. దీంతో చిత్రం వర్గాలు మాత్రం ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అవుతుందని పేర్కోన్నాయి. అయితే ద్వీతీరార్థం కాదు ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. విరాటపర్వం చిత్రాన్ని జూన్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న విరాటపర్వం చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more