తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశాడు. ‘నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. విషెస్ చెప్పడానికి చాలా దూరం నుంచి మాఇంటికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపున్నాను. మీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. మిమ్మల్ని కలవలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. మీ చూపించే ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను’అంటూ ఓ ఎమోషనల్ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశాడు.
కాగా, తమ అభిమాన హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్పై హైదరాబాద్ పోలీసులు లాఠీ చార్జ్ చేసిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి భారీ సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంత మంది అభిమానులు కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు. పోలీసులు వారిని పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటకీ రోడ్డుపైనే డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేయడంతో లాఠీచార్జ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more