బాలీవుడ్ అగ్రనటులలొ ఒకరిగా వెలుగొందుతున్న ఓ స్టార్ హీరోకు నెటిజనులు ఇచ్చిన షాక్ గట్టిగానే తగిలింది. దీంతో ఆయన దెబ్బకు దిగివచ్చి.. తనను క్షమించాలంటూ వేడుకోవాల్సి వచ్చింది. ఔనా.. నిజమేనా.. అంటే ముమ్మాటికీ నిజం. ఇంతకీ ఎవరా హీరో.. విమర్శలకు దిగివచ్చి.. క్షమించాలని కోరడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ అలా దిగివచ్చిన హీరో ఎవరు అంటే ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయితే అయనకు దిగిరావాల్సిన తప్పని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎందకు అన్న వివరాల్లోకి వెళ్తే..
పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అదేంటి ఇప్పటికే బాలీవుడ్ అగ్రతారలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ సహా మరికోందరు పోగాకు ఉత్పత్తులకు ప్రచారకర్తలు వ్యవహరిస్తున్నారు కదా అంటే.. అయితే ఇక్కడే ఓక మెలిక ఉంది. గతంలో ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు పోగాకు ఉత్పత్తులకు బ్రాండ్కు అంబాసిడర్ వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ఒక్కేవ్యక్తి ఒకప్పుడు అలా చెప్పి.. తాజాగా ఇలా చేయడంపై కస్సుబస్సు మంటున్నారు.
అభిమానుల అగ్రహానికి దిగివచ్చిన అక్షయ్ కుమార్ ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండబోనని ప్రకటించాడు. అంతేకాదు, ప్రజల ప్రాణాలను హరించే ఉత్పత్తులకు ప్రచారం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఈ మేరకు గత రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనను అభిమానులు, ప్రజలు క్షమించాలని కోరుతూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ నోట్ విడుదల చేశాడు. ‘‘నన్ను క్షమించండి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పందన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవించి తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను’’ అని ఆ నోట్లో పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more