తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా తన స్వయంకృషితో ఎదిగన నటుడు చిరంజీవి. తాను ఎంత కష్టపడినా.. ప్రేక్షకుల కరతళాధ్వనుల ముందు కష్టం మిగిల్చిన గాయాలు దిగదుడుపేనని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయనకు ఉన్న అభిమాన సముద్రం అంతుచిక్కనిదే. అందుకే ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఏ రోజు ఏ అపద వచ్చినా రక్త అందుబాటులో లేక మరణించకూడాదని చిరంజీవి చారిటెబుల్ ట్రస్టు ద్వారా రక్తనిధిని ఏర్పాటు చేశారు. అందేకాదు వారి కోసం ఐబ్యాంకును కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
అలాంటి చిరంజీవి అభిమానులకు ఎంత చేసినా తక్కువనే అనుకుంటారు. ఆయన తన అభిమానుల శ్రేయస్సు కోసం నిత్యం పరితపిస్తుంటారు. అందుకనే పదేళ్ల పాటు చిత్రసీమకు దూరంగా వున్నా ఆయన రీ-ఎంట్రీ ఇవ్వడంతోనే వరుస హిట్ చిత్రాలతో ఆయనను ఎప్పటికీ అందనంత ఎత్తులో ఉంచుతారు అభిమానులు. ఇటీవల కరోనా సమయంలోనూ ఆయన ఓ గోదావరి ప్రాంతానికి చెందిన అభిమానికి తన సొంత ఖర్చులతో హార్ట్ సర్జరీ చేయించారు. అంతేకాదు తన సతీమణితో కలసి వెళ్లి మరీ అమెను పరామర్శించి.. ధైర్యం అందించారు.
ఇలా తన అభిమానులు ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తారాయన. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో ఆయన వారి గురించి అంతకన్నా ఎక్కువ అలోచిస్తారు. ఇప్పటివరకు ఎన్నో సాయాలు ఎందరికో గుప్త దానాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి.. వాటిని బయటకు చెప్పుకునేందుకు సుముఖత చూపరు. చేయిన సాయం చేతికే తెలియాలి కానీ కంటికి, నోటికి, చెవులకు వినిపించడం వల్ల లాభం ఏంటన్న విధానం ఆయనది. ఆయన నుంచి సాయం పోందిన వ్యక్తులు ఏదో సందర్భాల్లో చెబితే తప్ప అవి బయట ప్రపంచానికి తెలియదు.
తాజాగా చిరంజీవి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో అభిమానికి వైద్యంచేయించేందుకు ముందుకు కదిలారు. ఎంతైనా ఖర్చు చేసి బ్రతికించేందుకు సిద్ధం అయ్యారు. విశాఖ జిల్లాకి చెందిన చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. అయితే ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు చిరు దృష్టికి తీసుకెళ్లారు. చిరంజీవి వెంటనే వెంకట్కు మెరుగైన వైద్యం అందించాలని భావించాడు. హైదరాబాద్కి తరలించమని పూర్తిగా వైద్య ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more