భారీ అంచనాలు, పోటాపోటీ ప్రచారాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల ఫలితాలపై పలువురు వ్యక్తం చేస్తున్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ విషయాలను పక్కన బెడితే.. ముందుగా గెలిచారని ప్రచారం జరిగిన కొందరు తరువాత మాత్రం ఓఢారని ఎలా ప్రకటించారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మొత్తంగా గ్లామరస్ స్టార్లు, నటీనటలకు సంబంధించిన పోటి కాబట్టి దీనిపై సర్వత్రా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారికి కూడా ఆసక్తి కనబర్చారు. అయితే వారికి కూడా అంతుచిక్కని ప్రశ్నలు మా ఎన్నికలలో చోటుచేసుకున్నాయి.
ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో జబర్థస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ భారీ మెజారిటీతో గెలుపోందారని వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత సోమవారినికి ఫలితం ఏకంగా మారిపోయింది. అనసూయ ఓటమిపాలయ్యిందని ప్రకటించారు. దీంతో రంగమ్మత్త కూడా విస్మయానికి గురైంది. తన సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టును పెడుతూ.. ఓ పాఠం నేర్చుకున్నానని చెప్పుకోచ్చింది. అంతేకాదు ఎన్నికల ఫలితాలపై పలు అనుమానాలను కూడా వ్యక్తం చేసింది.
ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి కార్యవర్గ సభ్యురాలిగా పోటీచేసిన ఆమె ఓటమి చెందారని ప్రకటించారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు మరో ట్వీట్ చేస్తూ.. మా ఎన్నికలలో ఉన్నవి మొత్తం 900 ఓట్లు.. అందులో పోలైనవి కేవలం 600 ఓట్లు. వాటిని లెక్కించడానికి రెండో రోజుకి ఎందుకు వాయిదా వేశారు. ఆదివారం గెలుపు అని చెప్పి ఈ రోజు ఓటమి అంటున్నారు, రాత్రికి రాత్రి ఏం జరిగింది? అని ప్రశ్నించారు. నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Ok. Lesson learnt. pic.twitter.com/2PSFh2AlMW
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more