ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్.. తొలిచిత్రంతోనే తనలోని నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించాడు. నటనాపరంగా అన్నివర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు కొట్టేశాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కుతుంది, ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మేకర్స్ ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. గతంలోనే పూర్తి కావాల్సిన ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ పనుల్లో కోవిడ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆలస్యం నెలకొంది. అయితే ఇపుడు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీకి వచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. క్రిష్-వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టు విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ డీ గ్లామరైజ్ డ్ పాత్రలో నటిస్తోంది. డైరెక్టర్ క్రిష్ నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్టుకు కొండపాలెం, జంగిల్ బుక్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. తొలుత ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలోనే విడుదల చేస్తారని వార్తలు రాగా..ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more