Rana Daggubati salutes women, sharing video రానా దగ్గుబాటి విరాటపర్వం నుంచి టీజర్

Rana daggubatis virata parvam teaser out

Rana Daggubati, chiranjeevi, Teaser, sai pallavi, Priyamani, Nandita Das, Venu Udugula, Suresh Babu Daggubati, Sudhakar Cherukuri, virata parvam's cast, rana daggubati's movies, Tollywood, movies news, Entertainment

Rana Daggubati and Sai Pallavi starrer 'Virata Parvam's teaser is out. Venu Udugula directs the film. Suresh Productions have bankrolled the movie. It is produced by Rana Daggubati’s father, Suresh Babu Daggubati, in association with Sudhakar Cherukuri.

చిరంజీవి చేతుల మీదుగా ‘విరాటపర్వం’ టీజర్ విడుదల

Posted: 03/18/2021 07:04 PM IST
Rana daggubatis virata parvam teaser out

ఫాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపోందిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ చిత్ర టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తూ.. తన చేతుల మీదుగా టీజర్ విడుదల చేయడం సంతోషంగా వుందని అన్నారు. టీజర్ ను బట్టి చూస్తే సినిమా చాలా వాస్తవికంగా ఉన్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. రానా, సాయిపల్లవితో పాటు యావత్‌ చిత్ర బృందానికి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు మెగాస్టార్. చిరంజీవి స్పందనకు రానా కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్‌ విషెస్‌ తమకు గౌరవంగా భావిస్తున్నామన్నారు. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌లోని సన్నివేశాల్ని బట్టి చూస్తే..  భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. రానా కవిత్వానికి ఫిదా అవుతుంది సాయి పల్లవి. ప్రేమ కోసం అన్నీ వదిలేసి రానా దగ్గరకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? రానా కామ్రేడ్‌గా ఎందుకు మారాడు?  వంటి వివరాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

కవిత్వం చెప్పిన తీరు, సాయి పల్లవి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కృష్ణుడి కోసం తల్లిదండ్రులను వదిలేసిన మీరాబాయిలా నేను నీ కోసం అన్ని వదిలేసి వస్తున్నా.. నిజంగా ప్రేమకు ఇంత శక్తి వుందా.? అన్న డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సురేశ్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles