బాలీవుడ్ నటి అనుష్కశర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతం తల్లికాబోతున్న అనుష్క శర్మ ఆనందంగా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. తన ఆనందాన్ని అందరికీ తెలియచేస్తూ తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. అమె పోస్టును షేర్ చేసుకుంటూ, లైక్ చేస్తూ అభిమానులు పంచుకున్నారు. అంతేకాదు ఇదే పోస్టును విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సైతం పంచుకున్నారు. అయితే ఓ మహిళా జర్నలిస్ట్ మాత్రం అనుష్క పోస్టుపై వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
విరాట్ కోహ్లీ అమెను తల్లిని మాత్రమే చేశాడని, ఇంగ్లాండ్ కు రాణిని చేయలేదన్న అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేసింది. ‘అనుష్క, ఆయన (విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ) మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ కి మహారాణిని చేయలేదు. మరీ అంత సంబరపడకండి’ అంటూ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. దీనిపై కూడా అమె అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు బుదలిచ్చారు. అయితే మహిళా జర్నలిస్టు చేసిన కామెంట్లపై దర్శకుడు మారుతి మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళా జర్నలిస్టుగా వుంటూ తల్లి కావడాన్ని చులకనగా, ఆ సంతోషాన్ని తేలిగ్గా కోట్టిపారేయడం సమంజసం కాదని హితవు పలికారు.
ఒక రాజ్యానికి రాణిగా ఉండటం కంటే ఓ బిడ్డకి తల్లిగా ఉండడంలోనే మహిళకు ఎంతో సంతోషం ఉందని ఆయన అన్నారు. ‘ఒక మహిళా జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం విచారంగా ఉంది. ఇంగ్లాండ్కు రాణిగా ఉండటం కంటే మాతృత్వపు ప్రేమను ఆస్వాదించడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్నిస్తుంది. నిజం చెప్పాలంటే.. ప్రతి మహిళా ఓ మహారాణినే. ప్రతి సంతోషకరమైన నివాసం ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడానికంటే ముందు ఓ సాధారణమైన స్త్రీ. తల్లికాబోతున్న క్షణాలను ఆసాంతం ఆనందించే హక్కు ఆమెకు ఉంది’ అని మారుతి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more