అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రికి ప్రభుత్వం ఒక అవార్డును ఇస్తే బాగుంటుందని అడిగాడో లేదో.. అలా ఓ ప్రతిష్టాత్మక అవార్డు అల్లు అరవింద్ ఖాతాలోకి వచ్చి చేరనుంది. టాలీవుడ్ చిత్రపరిశ్రమకు యనలేని కృషి సల్పిన అల్లు అరవింద్ కు తమ ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’’ అవార్డుకు అందించనున్నట్లు అవార్డు సంస్థ ప్రకటించింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమీషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జ్ఞాన్ సుధా మిశ్రాలతో పాటు పలువురు ప్రముఖలు ‘‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’’ అవార్డు కమిటీకీ జ్యూరీగా వ్యవహరిస్తున్న ఇంటరాక్టివ్ ఫారమ్ ఇండియన్ ఎకానమీ ఆధ్వర్యంలో ఈ అవార్డుల నిర్వహణ కార్యక్రమం జరగనుంది.
ప్రతిష్ట్మాతక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న బిరుదాంకితుడు ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు అవార్డునిచ్చి సత్కరించనున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఈ అవార్డును ఇన్నాళ్లు రాజకీయ, క్రీడారంగంలోని ప్రముఖలకు అందించిన సంస్థ ఈ సారి చిత్రరంగానికి చెందిన అల్లు అరవింద్ ను కూడా ఎంచుకుని సత్కరించడం ముదావహం.
తెలుగు చిత్రపరిశ్రమకు పాటుపడి టాలీవుడ్ లో అగ్రనిర్మాతలలో ఒకరిగా నిలబడ్డారు అల్లు అరవింద్. తెలుగుతో పాటు దక్షిణాది బాషల్లో కూడా పలు చిత్రాలను నిర్మించారు. దక్షిణ భారతంతో పాటు అటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాలను నిర్మించి దేశవ్యాప్తంగా వున్న సినీ అభిమానులకు తన సేవలను అందించారు. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ నేపథ్యంలో మారిపోయే ప్రేక్షకుల అభిరుచి మేరకు చిత్రాలను నిర్మించిన ఆయన ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును ప్రదానం చేయడం ప్రశంసనీయం.
తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మళయాలంతో పాటు పలు బాషలలో చిత్రాలను నిర్మించారు అల్లు అరవింద్. అంతేకాదు తాను నిర్మించిన చిత్రాలు అనేకం ప్రేక్షకుల మనన్నలు పోంది సూపర్ డూపర్ హిట్ల్ లుగా బాక్సాఫీసును షేక్ చేశాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, అనీల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలతో ఆయన చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నారు.
ఈ క్రమంలో సుమారు నాలుగు దశాబ్దాలుగా అల్లు అరవింద్ సినీపరిశ్రమకు చేస్తున్న సేవలను పర్యవేక్షించిన అవార్డు కమిటీ ఆయనకు అవార్డునిచ్చి సత్కారించనుంది. అల్లు అరవింద్ తో పాటుగా జార్ఖండ్ ఎన్నికలలో తనదైన ముద్ర వేసుకున్న జార్ఖండ్ ముక్తి మోర్చ అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు కూడా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గాలైన డుమ్కా, బార్హైత్ అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన కృషికి ఆయనను అవార్డు కమిటీ సత్కరించనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more