కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో కలిసి ప్రత్యక్షమైంది. తాను శాండల్ వుడ్ కు చెందిన దర్శకుడు అంజనప్పను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆయనను పెళ్లి చేసుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు అంగీకరించలేదని.. దీంతో తాను వారికి చెప్పకుండా భర్తకు చెందిన గ్రామానికి చేరుకుని అక్కడ అతడ్ని వివాహం చేసుకున్నామని వెల్లడించింది.
ప్రస్తుతం తాను అంజనప్ప ఇద్దరి చట్టరిత్యా భార్యభర్తలమని, తమను విడదీసేందుకు తమ తల్లిదండ్రులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమె రాయచూర్ జిల్లా ఎస్పీ సిబి వేదమూర్తిని అభ్యర్థించారు. అయితే తమ కూతురు కనిపించకుండా పోవడంతో అమె అదృశ్యంపై అందోళన చెందిన అమె తల్లిదండ్రులు మాండ్యాలో పోలీసులకు పిర్యాదు చేయగా వారు అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. కాగా విజయలక్ష్మీ తల్లిదండ్రుల పిర్యాదులో అంజనప్పపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజాగా విజయలక్ష్మీ దంపతులు వాంగ్మూలంతో ఆ కేసును పోలీసులు క్లోజ్ చేయనున్నారు.
ఇదిలావుండగా విజయలక్ష్మీ తన తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలు చేసింది. ఎస్పీ వేదమూర్తి అదేశానుసారం వారు హళ్లి హోసూరు పోలీసు స్టేషన్ కు చేరుకుని అక్కడ తమకు రక్షణ కావాలని కోరిన తరువాత మీడియాతో మాట్లాడారు. తాను ఆంజనేయను ప్రేమించానని, గంగావతిలో వివాహం చేసుకున్నానని, ఇది నచ్చక తన తల్లి సవిత, అమ్మమ్మ విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు వార్తలను సృష్టించి డ్రామాలాడారని ఆరోపించింది. తాను ఎవరి నుండి డబ్బులు తీసుకోలేదని అమె మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
తన కన్న తండ్రి నుంచి తల్లి సవిత ఆరేళ్ల క్రితమే విడిపోయి, మరో వ్యక్తిని వివాహం చేసుకుందని, పెంచిన తండ్రి పెట్టే బాధలను తాను తట్టుకోలేకపోతున్నానని సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను చంపేందుకు కూడా కుట్ర చేశారని, తాను ఎవరి నుంచీ డబ్బులను, బంగారాన్ని తీసుకోలేదని చెప్పింది. తాను పెళ్లి చేసుకోకూడదని, డబ్బులు సంపాదిస్తూ ఉండాలన్నదే వారి అభిమతమని ఆరోపించింది. జిల్లా పోలీసులను కలసి రక్షణ కల్పించాలని కోరినట్టు పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more