ధర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రూపోందిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం ఇవాళ్టితో వంద రోజులు పూర్తి చేసుకుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో.. నయనతార, తమన్నా ప్రధాన హీరోయిన్స్ గా నటించారు. కాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు.
రాయలసీమకు చెందిన మొదటి తరం స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఐదు ప్రధాన బాషలలో విడుదల కావడం జరిగింది. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ క్యాస్ట్ తో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సైరా మూవీ తెరకెక్కింది. దర్శకుడు సురేంధర్ రెడ్డి రెండేళ్లు కష్టపడి విజువల్ వండర్ గా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. ఉద్యమ వీరుడిగా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి విజృభించారు. తాజాగా ఈ సినిమా ఎమ్మిగనూరులో నేరుగా 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.
2019 గాను టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్సింగ్ సాధించిన చిత్రంగా సైరా నరసింహారెడ్డి నిలిచింది. అయితే ఎన్ని కేంద్రాలలో శతజయంతోత్సవం జరుపుకుందన్న వివరాలు తెలియాల్సి వుంది. విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 105.83 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టగా.. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా 140.73 కోట్లను ఆర్జించింది. అయితే ఆ తరువాత ఈ చిత్రానికి పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. చిరంజీవి రీఎంట్రీ తరువాత కూడా తన అభిమానులు అధికంగా వున్న నైజాంపై ఆయన పట్టు తగ్గలేదని ఈ చిత్రానికి 20 రోజల్లో 32 కోట్ల షేర్ వసూళ్లు కావడమే స్పష్టం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more