Veteran actor Gollapudi Maruti Rao no more బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Veteran writer and actor gollapudi maruthi rao passes away

Gollapudi Maruti Rao, Chennai, Gollapudi Maruti Rao news, gollapudi maruthi rao death, Gollapudi Maruti Rao passes away, Gollapudi Maruti Rao no more, Gollapudi Maruti Rao novels, Gollapudi Maruti Rao cinemas, Gollapudi Maruti Rao dialogues, gollapudi maruthi rao telugu movies, gollapudi maruthi rao latest news, gollapudi maruthi rao tollywood, Tollywood, Movies, Entertainment,

Telugu actor Gollapudi Maruti Rao passed away here on Thursday at a hospital in Chennai. He was 80. Born on April 14, 1939 in Vizianagaram, Rao ventured into the film industry with Intlo Ramaiah Veedilo Krishnaiah and went on to act in over 250 films. He authored various books, novels and plays.

బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Posted: 12/12/2019 02:28 PM IST
Veteran writer and actor gollapudi maruthi rao passes away

ప్రముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. నాటకరంగం, రచయిత, వక్త, వ్యాఖ్యాతగా, పలు రంగాలలో తన సత్తాను చాటిన ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఏకంగా 290 చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించి.. ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు.

సినీరంగ ప్రవేశానికి ముందుకు ఆయన నాటక రంగంలో రాణించారు. పలు నాటిక, నటకాలు, నవలలు, కథలు కూడా రచించారు. రచయితగా, సంభాషణకర్తగా కూడా ఆయన ప్రతిష్మాత్మక నందీ అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో మొదటి రచన 'డాక్టర్ చక్రవర్తి'కి ఉత్తమ రచయితగా ఆయన నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయంటే ఆయన ఎంతటి మేధావి అన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అయితే నాటకరంగంపై వున్న మక్కువతో.. సినీరంగంపై ఆసక్తితో ఆయన చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య చిత్రంతో సినీమాల్లోకి తెరంగ్రేటం చేశారు. ఆ చిత్రానికి ఆయనే మాటల రచయితగా కూడా వ్యవహరించారు.

తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా ఉంది. మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన భార్య పేరు శివకామసుందరి.. ఆయనకు ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gollapudi Maruti Rao  Actor  Writer  Anchor  Screen Writer  dialogue writer  Tollywood  

Other Articles