దేశవ్యాప్తంగా దిశ హత్యోదంతం కేసు పెను సంచలనంగా మారి.. పార్లమెంటులో ఇదే అంశం దద్దరిల్లిపోవడంతో జాతీయ నేతల అందరి చూపు తెలంగాణ వైపే వున్న తరుణంలో మరో దారుణమైన ఘటన హైదరాబాద్ నగరం రహదారిపై జరిగడం కలకలం రేపుతోంది. సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న మహిళ కారును ఢీకొట్టిన ముగ్గురు మైనర్లు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడమే కాదు దాడి కూడా చేశారు. మహిళలను ముందుపెట్టి ఆర్ట్ డైరెక్టర్ పై అమానుషంగా ప్రవర్తించారు.
అమె లోదుస్తులను చించి వేయడం, ఫ్యాంటును లాగడం.. అమె ప్రైవేటు ఫార్ట్స్ తాకడంతో పాటు నానా రభస చేశారు. చేయాల్సినదంతా చేసిన తరువాత మహిళలను ముందుకు నెట్టేసారని బాధితురాలు తెలిపింది. ఇక రాష్ట్ర మంత్రులు 100 డయల్ చేసివుంటూ దిశను క్షణాల్లో కాపాడగలిగేవాళ్లమని చెప్పుకున్న గొప్పలు కూడా నీటిమూటలని తేలిపోయాయి. బంజారాహిల్స్ లో జరిగిన అమానుష ఘటనలో బాధితురాలు 100 డయల్ చేసిన 40 నిమిషాల తరువాత.. పోలీసులు వచ్చారని తెలపడమే ఇందుకు నిదర్శనం.
ఇక బాధితురాలు పోలీసులకు చేసిన పిర్యాదు మేరకు ఘటన వివరాలు ఇలా వున్నాయి. సినీ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న మహిళ సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కారులో వెళ్తున్నారు. ఆమెను ముగ్గురు ఆకతాయిలు వెంబడించారు. ఆమె కారు ఢీకొట్టారు.. ఆమె కారు ఆపడంతో కారులో నుంచి బయటకు లాగి ఆమెపై పట్ల వికృత చేష్టలకు పాల్పపడ్డారు. ఆమెను బండ బూతులు తిడుతూ.. వెనుక నుంచి కొడుతూ లో-దుస్తులు చించేశారని భాదితురాలు పిర్యాదులో పేర్కోంది.
బాధితురాలిపై దారుణంగా ప్రవర్తించడంతో పాటు అమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారని పేర్కోంది. తన టీషర్టును లాగేందుకు కొందరు ప్రయత్నించగా, మరికొందరు ముందునుంచి తన లోదుస్తులను లాగారని, తన ఫ్యాంటును కూడా లాగేందుకు ప్రయత్నించారని, ఇక వారితో వచ్చిన మహిళ కూడా తన టీషర్టును తీసివేసేందుకు ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాక్సిడెంట్ కేసుగా భావించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అయితే జరిగిన విషయం సీఐ తెలుసుకొని ఆమె ఆదేశాలతోనే బంజారాహిల్స్ పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితురాలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more