రాజకీయాలలో ఫుల్ బిజీగా వున్నా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ప్రజా సమస్యలపై ప్రజాగొంతుకనై ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన.. ఈ క్రమంలో సినిమాలకు కూడా దూరంగా వుంటానని చెప్పారు. అయితే తాజాగా దిల్ రాజుకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ అభిమానులను ఫుల్లుగా హ్యఫీ చేసిన ఈ వార్తలు నిజమేనా.? అనే సమయంలోనే ఈ చిత్రానికి ఆయన రూ.40 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
మెగా అభిమానులు ఈ వార్తలు నిజమని భావిస్తున్న తరుణంలో మరో పిడుగులాంటి వార్త అందింది. తనకు తెలియకుండా.. తన అనుమతి లేకుండా.. తాను నటిస్తానో లేదోనని అడగకుండానే ప్రచారం చేసిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తీరుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు.. అందుకోసం దిల్ రాజు ప్రోడక్షన్స్ తో చేయికలిపినట్టు.. ఇక ప్రధాన పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నట్లు సినీవిశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయబోతున్నాడని.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలును రాస్తున్నాడని కూడా టాక్ వినిపించింది. ఇక సినిమాలో హీరోయిన్స్గా నయనతార, తమన్నా, పూజా హెగ్డేను తీసుకోవాలన్న బోనీ కపూర్ సూచనలతో పాటు తాను ఈ చిత్రంలో నటిస్తున్నందుకు రూ.40 కోట్ల పారితోషకం కూడా తీసుకుంటున్నానని వార్తలు రావడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనానికి లోనయ్యారని సమాచారం. ఈ ప్రాజెక్టులో తాను నటిస్తున్నానని చెప్పే ముందు తన అనుమతి తీసుకోవాలని కదా.? అలా తన పర్మిషన్ తీసుకోకుండా... ఈ ప్రాజెక్ట్ను ఎలా అనౌన్స్ చేస్తారని మండిపడ్డట్టు తెలుస్తోంది.
అయితే ‘పింక్’ సినిమా చూసి ఈ కథ తనకు నచ్చింది అని చెప్పాను. కానీ ఈ రీమేక్ లో నటిస్తానని మీకు చెప్పలేదని.. కేవలం ఆలోచిస్తాను అని చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని తాను ఈ రీమేక్లో నటిస్తున్నట్టు ఎందుకు ప్రచారం చేసారని దిల్ రాజు, బోనీ కపూర్ లపై మండిపడ్డట్టు సమాచారం. ఈ విషయాలన్ని త్రివిక్రమ్ దృష్టికి వరకు వెళ్లగా.. తాను తిరిగొచ్చే వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి లీకులు ఇవ్వద్దని నిర్మాతలకు చెప్పాడట. తన విదేశీయానం పూర్తైన తరువాత పవన్ ను కలిసి సినిమా చేయాలనుందో లేదో తెలుసుకుంటానిని చెప్పాడని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more