బాలీవుడ్ హాట్ బ్యూటీగా, ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ పై అమె అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు బోల్గ్ నటనతో కాంట్రావర్సీలకు కేరాఫ్ గా మారిన నటి రాఖీ సావంత్ ముంబైలోని ఓ హోటల్లో ఎన్నారైని పెళ్లాడినట్టు జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాఖీ పెళ్లికుమార్తె డ్రెస్లో ఉన్న ఫొటోలను కూడా ప్రచురించాయి.
బోల్డ్ బ్యూటీ ఓ ఇంటిదయ్యిందన్న వార్త మీడియాలో వస్తే.. తూచ్ అదంతా తప్పు.. ఆ వార్తల్లో నిజంలేదని.. కేవలం జేడబ్యూ మారియట్ హోటల్ పెళ్లికూతురు వేషంలో ఫోటో షూట్ నిర్వహిస్తున్నందున తాను అలా తయారయ్యానని, అది కేవలం ఫోటో షూట్ మాత్రమేనని తోసిపుచ్చింది. దీంతో అభిమానులు సంతోషించారు. తమ బోల్డ్ నటికి ఇంకా వివాహం కాలేదని.. కలల ప్రపంచంలో మునిగిపోతున్నారు.
అయితే తాజాగా అమె తన అభిమానులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. అదేంటంటే తాను పెళ్లి చేసుకున్నానని, దీంతో అభిమానులు అమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాదు తన భర్త వివరాలను కూడా చెప్పింది. యూకేలో ఉన్న ఎన్నారై బిజినెస్ మెన్ రితీశ్ ను పెళ్లాడానని ఆమె ప్రకటించింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది.
పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని... వీసా కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పింది. రితీశ్ తన అభిమాని అని తెలిపింది. ప్రభు చావ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సమయంలో అతను తనను మొదటి సారి చూశాడని... ఆ తర్వాత వాట్స్ యాప్ ద్వారా మెసేజ్ పంపాడని రాఖీ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని... ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని తెలిపింది. ఇంత మంచి భర్తను తనకు ఇచ్చినందుకు జీసస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది.
సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని తెలిపింది. 2020 కల్లా ఓ బిడ్డకు తల్లి కావాలనేది తన కోరిక అని రాఖీ చెప్పింది. అందులోనూ తన అభిమానిగా వున్న ఓ ఎన్ఆర్ఐ వ్యక్తినే తాను పెళ్లి చేసుకున్నానని అమె తెలిపారు. దీంతో ఇప్పుడీ హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ అభిమానులు ఖంగుతిన్నారు. ఒక్క అభిమానికి న్యాయం చేస్తే మరి మా పరిస్థితి ఏంటీ అని అన్నట్లుంది వారి వాదన. హద్దులు మీరిన అభిమానం వుంటే దెబ్బలు తప్పవుగా మరి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more