ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరోలకంటే హీరోయిన్స్ కి పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా తమకి పారితోషికాలు ఇవ్వవలసిందేనంటూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇకనైనా హీరోయిన్స్ పారితోషికాల విషయంలో మార్పు రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తాప్సీ స్పందిస్తూ .. " హీరోలతో సమానమైన పారితోషికం హీరోయిన్స్ కి కూడా ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదు" అంది.
"నేను కొంతమంది స్టార్ హీరోల సరసన కథానాయికగా చేశాను. అలాగని చెప్పేసి వాళ్లకి ఇచ్చేంత పారితోషికం నాకు ఇవ్వవలసిందేనని నేను అడగలేను. ఎందుకంటే వాళ్ల మాదిరిగా థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించే శక్తి నాకు లేదు. ఎవరి మార్కెట్ ను బట్టి .. క్రేజ్ ను బట్టి వాళ్లకి పారితోషికాలు ఉంటాయి. ఈ విషయంలో ఇతరులతో పోల్చుకోకుండా ఎవరి స్థాయికి తగిన పారితోషికాలు వాళ్లు తీసుకోవడమే మంచిది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్లో 40 శాతమే వచ్చిందిని ఎమ్టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more