బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న దర్శక దిగ్గజం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించిన అందుబాటులోకి వస్తున్న తాజా అప్ డేట్ ఆయన అభిమానులతో పాటు ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరోవైపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఫ్యాన్స్ కూడా ఎంతో అసక్తిని కనబరుస్తున్నారు. అభిమానుల ఉత్కంఠకు చిత్ర దర్శకుడు రాజమౌళి ఎట్టకేలకే తెరదించుతూ త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని చెప్పారు. అయితే తాజాగా ముహూర్తాన్ని కూడా ఖరారు చేశాడు.
ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో, ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా టీజర్ ను విడుదల చేశారు. డీవీవీ దానయ్య ప్రోడక్షన్ హౌజ్ నుంచి ఈ తాజా అప్ డేట్ నెట్టింట్లో అధికారికంగా పట్టాలేక్కే తేదీని ఖారురు చేసింది. నవంబర్ అంటే 11వ నెల.. ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను కూడా వదలడంతో, అంతా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు.
టైటిల్ ను ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు? .. హీరోయిన్లుగా ఎవరిని తీసుకున్నారు? వంటి ప్రశ్నలు అందరిలోనూ తలెత్తాయి. టైటిల్ సంగతి అటుంచితే, హీరోయిన్లు ఎవరనే విషయాన్ని మాత్రం ఈ సినిమా లాంచ్ రోజున ప్రకటన చేసేస్తారనే వార్తలు కూడా సినీవర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వాళ్ల ఎంపిక పూర్తయిందనీ.. అందువలన 11వ తేదీన ఎనౌన్స్ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు. హీరోయిన్స్ గా ఎవరు ఛాన్స్ కొట్టేశారో అంటే 11వ తేదీ వరకు వేచి చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more